రాజ్మార్గయాత్ర వెబ్సైట్లో చూపిస్తున్న వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అగ్నంపాడి, భ్రమణపల్లి, చిట్టిమిట్టి హింతాలా, చోలసముంద్రం, గంట్యాడ, గొల్లప్రోలు, కొత్తపల్లి, మోపిదేవి, పంచవటి న్యూ, పెదగరువు, వెంకటపాలెం, ఎర్రదొడ్డి టోల్ ప్లాజాలు ఉన్నాయి. తెలంగాణలో దిలావర్పూర్, కొత్తగూడెం, సింగరేనిపల్లి టోల్ ప్లాజాల్లో ఈ సదుపాయం అందుబాటులో ఉంది. లోకల్ పాస్ ధర ప్రతి టోల్ ప్లాజాకు వేర్వేరుగా ఉంటుంది. పేమెంట్ను నిర్ధారించే ముందు పేమెంట్ గేట్వేలో ధర కనిపిస్తుంది. ప్రభుత్వం జారీ చేసే నోటిఫికేషన్ల ప్రకారం ఈ ఛార్జీలను మార్చే అవకాశం ఉంటుంది. ఒకే లోకల్ పాస్ను పలు టోల్ ప్లాజాల్లో ఉపయోగించడానికి కుదరదు. పాస్ కొనుగోలు చేసే సమయంలో ఎంచుకున్న నిర్దిష్ట టోల్ ప్లాజాకు మాత్రమే ఇది చెల్లుతుంది. అదే అథారిటీ నిర్వహించే మరో టోల్ ప్లాజాలో కూడా ఈ పాస్ను ఉపయోగించలేరు. ఇతరులకు ట్రాన్స్ఫర్ చేయడం కూడా సాధ్యం కాదు. (ప్రతీకాత్మక చిత్రం)
