Last Updated:
స్మార్ట్ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ వార్త మీ బడ్జెట్ను మార్చేయొచ్చు! ప్రముఖ బ్రాండ్లకు చెందిన iQOO, OPPO, OnePlus, Redmi, Vivo ఫోన్ల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఇందులో ఏ ఫోన్పై ఏకంగా రూ.13,000 వరకు ధర పెరిగింది? పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.
Smartphone Price Hike India: భారత్లో స్మార్ట్ఫోన్ కొనుగోలుదారులకు వరుసగా ధరల పెంపు షాకులు ఎదురవుతున్నాయి. ప్రముఖ బ్రాండ్లకు చెందిన పలు 5G, ప్రీమియం స్మార్ట్ఫోన్ల ధరలు పెరిగాయి. OPPO, OnePlus, iQOO, Redmi, Vivo సంస్థలు తమ ఎంపిక చేసిన మోడళ్ల ధరలను సవరించాయి. కొన్ని ఫోన్లపై రూ.3,000 నుంచి రూ.5,000 వరకు పెంపు ఉండగా, iQOOకి చెందిన ప్రీమియం ఫోన్లలో ఏకంగా రూ.13,000 వరకు ధర పెరిగింది. పెరుగుతున్న మెమరీ చిప్ ధరలు ఈ మార్పులకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు.

