భారతీయ రైల్వేల్లో ఆధునికీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. అన్ని వర్గాల ప్రయాణికులకు అందుబాటులో ఉండే ధరల్లో మెరుగైన, నాణ్యమైన రైలు సేవలు అందించడంపై రైల్వే శాఖ దృష్టి పెట్టింది. 2014 తర్వాత ఈ మార్పుల్లో భాగంగా ప్రయాణికుల అవసరాలను బట్టి ఎన్నో కొత్త రైలు రకాలను తీసుకొచ్చారు. తక్కువ ఖర్చుతో దూర ప్రయాణాలు, ప్రీమియం డే టైమ్ ప్రయాణాలు, సెమీ హైస్పీడ్ ఇంటర్సిటీ కనెక్టివిటీ, ఆధునిక స్లీపర్ సేవలు ఇలా ఒక్కో అవసరానికి తగ్గట్టుగా కొత్త రైళ్లను రూపొందించారు. 2016లో గతిమాన్ ఎక్స్ప్రెస్, హమ్సఫర్ ఎక్స్ప్రెస్, అంత్యోదయ ఎక్స్ప్రెస్తో మొదలైన ఈ ప్రయాణం… తర్వాత దేశీయంగా తయారైన వందే భారత్, అమృత్ భారత్, నమో భారత్ ర్యాపిడ్ రైల్ వరకు వచ్చింది. తాజాగా 2026లో వందే భారత్ స్లీపర్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ రైళ్లన్నీ కలిపి చూస్తే భారతీయ రైల్వేల్లో పెద్ద మార్పు కనిపిస్తుంది. ఆధునిక కోచ్లు, మెరుగైన భద్రత, మెరుగైన ప్రయాణ సౌకర్యాలు, ఎక్కువ వేగం, దేశీయ టెక్నాలజీ వినియోగం వైపు రైల్వేలు అడుగులు వేస్తున్నాయి. భారతీయ రైల్వే వివరాల ప్రకారం 2014 తర్వాత వచ్చిన 10 కొత్త రైళ్లు ఇవే. (ప్రతీకాత్మక చిత్రం)

