భారత్లోనే ఉండి రాఖీ పంపించడంలో ఆలస్యం చేసిన కుటుంబాలకు కూడా రాఖీ.కామ్ కొత్త సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశంలోని 500కు పైగా నగరాల్లో సేమ్-డే రాఖీ డెలివరీని ప్రారంభించింది. రక్షాబంధన్ సందర్భంగా దేశీయ డెలివరీ సేవలను ఇంత పెద్ద స్థాయిలో విస్తరించడం ఇదే తొలిసారి అని కంపెనీ తెలిపింది. మెట్రో నగరాలతో పాటు టైర్-2, టైర్-3 నగరాల్లో కూడా ఈ సేమ్-డే డెలివరీ అందుబాటులో ఉంది. ఆగ్రా, అమృత్సర్, భోపాల్, కోయంబత్తూర్, డెహ్రాడూన్, గువాహటి, జోధ్పూర్, కొచ్చి, లక్నో, లుధియానా, మైసూర్, నాగ్పూర్, పాట్నా, రాజ్కోట్, సూరత్, వడోదర, వారణాసి, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాలు ఇందులో ఉన్నాయి. వీటితో పాటు అన్ని ప్రధాన మెట్రో నగరాల్లోనూ ఈ సేవ అందుబాటులో ఉంది. (image: Rakhi.com)
