UIDAI ప్రకారం, ఆధార్ యాప్ను గోప్యత (Privacy), భద్రత (Security), సులభమైన వినియోగం (Ease of Use) అనే మూడు ప్రధాన లక్ష్యాలతో రూపొందించారు. డిజిటల్ ఇండియా మిషన్కు అనుగుణంగా ప్రజలకు వేగవంతమైన, సురక్షితమైన, పారదర్శకమైన సేవలను అందించడంలో ఈ యాప్ కీలక పాత్ర పోషిస్తోంది. అందువల్ల ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్, చిరునామా, ఇమెయిల్ ఐడీ వంటి వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉంచుకోవాలని UIDAI సూచిస్తోంది. దీంతో భవిష్యత్తులో ప్రభుత్వ సేవలు, బ్యాంకింగ్, పాన్, పాస్పోర్ట్, సబ్సిడీలు వంటి అనేక సేవలను పొందడం మరింత సులభం అవుతుంది.

