ఇప్పుడు ఇండియాలో యువ జనాభా ఎక్కువ. ప్రభుత్వాలు స్కిల్ డెవలప్మెంట్పై ఫోకస్ పెడుతున్నాయి. స్టార్టప్స్, యూనీకార్న్ వంటి సంస్థలు జోరుగా ఉన్నాయి. ఒకప్పుడు సమస్యలతో ఉండే వ్యవసాయంలో కూడా ఇప్పుడు చాలా విప్లవాత్మక మార్పులొచ్చాయి. అందువల్ల ఈ రంగం కూడా గ్రోత్ చూపిస్తోంది. UPI, ఆధార్ వంటి డిజిటల్ ఇన్ఫ్రా, GST లాంటి పన్ను సంస్కరణలు, ప్రజల మూలనధన ఖర్చులు పెరగడం, సర్వీస్ రంగంలో ఎగుమతులు పెరగడం, పల్లెల్లో కూడా అభివృద్ది అడుగులు పడుతుండటం.. ఇవన్నీ ఇండియాలో గ్రోత్ రేటును స్థిరంగా ఉండేలా చేస్తున్నాయి.

