ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన పెన్షనర్లకు జీతాలు, డియర్నెస్ అలవెన్స్, ఫిట్మెంట్ ఫ్యాక్టర్, వేతన నిర్మాణం, ఇతర ప్రయోజనాలపై మార్పులు సూచించడం దీని ప్రధాన పని. గత ఏడాది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన 8వ వేతన సంఘం తన తుది సిఫార్సులను 2027 మధ్య నాటికి ఇవ్వొచ్చని అంచనా. దీని వల్ల సుమారు కోటి మందికి పైగా లబ్ధి పొందే అవకాశం ఉంది. ఇందులో దాదాపు 50 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, సుమారు 65 లక్షల పెన్షనర్లు ఉన్నారు. రక్షణ శాఖ, రైల్వే శాఖకు చెందిన ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన సిబ్బంది కూడా ఇందులో భాగమే. (ప్రతీకాత్మక చిత్రం)

