అధికారిక పోస్ట్ ఆఫీసులు అందుబాటులోకి రాకముందు దేశంలో సమాచార ప్రసారం, లేఖల చేరవేత అత్యంత శ్రమతో, ప్రమాదాలతో కూడుకున్న ప్రక్రియగా ఉండేది. ఆ కాలంలో ‘డాక్ రన్నర్లు’ అని పిలిచే తపాలా బాటసారులు మైళ్ల కొద్దీ కాలినడకన ప్రయాణించి ఉత్తరాలను అందించేవారు. దట్టమైన అడవులు, పొంగిపొర్లుతున్న నదులు దాటుకుంటూ వెళ్లే ఈ రన్నర్లకు వన్యమృగాల దాడులు, దొంగల ముప్పు నిత్యం పొంచి ఉండేది. ప్రయాణం అత్యంత నెమ్మదిగా సాగడమే కాకుండా, పంపిన లేఖ భద్రంగా గమ్యం చేరుతుందో లేదో తెలియని అనిశ్చితి రాజ్యమేలేది. (ప్రతీకాత్మక చిత్రం)

