జన్ ధన్ ఖాతాల్లోని మొత్తం డిపాజిట్ల విలువ కూడా గణనీయంగా పెరిగింది. 2026 ఆగస్టు 19 నాటికి ఈ ఖాతాల్లో రూ.3,16,514 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. 2015 ఆగస్టు నుంచి 2026 ఆగస్టు మధ్య కాలంలో ఖాతాల సంఖ్య 2.3 రెట్లు పెరిగితే, డిపాజిట్ల విలువ ఏకంగా 12.8 రెట్లు పెరిగింది. ఇది ఖాతాదారులు తమ జన్ ధన్ ఖాతాలను కేవలం ఖాతా తెరవడానికి మాత్రమే కాకుండా, వాస్తవిక బ్యాంకింగ్ అవసరాలకు ఉపయోగిస్తున్నారని సూచిస్తోంది. ఒక్కో PMJDY ఖాతాలో సగటు డిపాజిట్ కూడా పెరిగింది. 2026 ఆగస్టు 19 నాటికి ఒక్కో ఖాతాకు సగటు డిపాజిట్ రూ.5,356గా ఉంది. 2015 ఆగస్టు నుంచి 2026 ఆగస్టు వరకు ఈ సగటు మొత్తం 3.4 రెట్లు పెరిగింది. ఖాతాల్లో డిపాజిట్లు పెరగడం వల్ల ఖాతాదారుల్లో పొదుపు అలవాటు బలపడటంతో పాటు, బ్యాంకింగ్ వ్యవస్థపై నమ్మకం పెరిగిందని భావించవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
