ప్రభన్యూస్

Petrol Diesel Exports: పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం! | బిజినెస్


Last Updated:

పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దేశీయంగా ఇంధన కొరత రాకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం (ATF) ఎగుమతులపై పన్నులను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది.

News18
News18

కేంద్ర ప్రభుత్వం ఇంధన ఎగుమతులపై పన్నుల విధింపును కొనసాగిస్తూ ఆదివారం కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, అమెరికా-ఇరాన్ వివాదం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల్లో భారీ హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో దేశీయంగా పెట్రోల్, డీజిల్‌కు ఎలాంటి కొరత రాకుండా చూడటం కేంద్రం ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. ఇంధన ఎగుమతులను నిరుత్సాహపరచి, స్థానిక అవసరాలకు సరిపడా నిల్వలు ఉండేలా చూసేందుకు గత మార్చి 27న పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం (ఏటీఎఫ్) ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం (SAED), రోడ్ సెస్ అమలులోకి తెచ్చింది.

సగటు అంతర్జాతీయ ముడిచమురు ధరల ఆధారంగా ప్రతి 15 రోజులకోసారి ఈ రేట్లను ప్రభుత్వం సమీక్షిస్తుంది. తాజా సమీక్ష అనంతరం రాబోయే పక్షం రోజుల పాటు ఈ పన్నులనే కొనసాగిస్తూ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.

కొత్త రేట్లు ఇలా..

న్యూస్18 కథనం ప్రకారం పెట్రోల్ ఎగుమతులపై లీటరుకు రూ.3.5 చొప్పున సుంకం వసూలు చేయనున్నారు. ఇది పూర్తిగా ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం కిందకే వస్తుంది. దీనిపై ఎలాంటి రోడ్ సెస్ ఉండదు. డీజిల్ ఎగుమతులపై లీటరుకు రూ.25.5 సుంకం విధించారు. ఇందులో రూ.24 ఎక్సైజ్ డ్యూటీ కాగా, రూ.1.5 రోడ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెస్ కింద వసూలు చేస్తారు. ఇక విమాన ఇంధనం (ATF)పై లీటరుకు రూ.22 ఎక్సైజ్ సుంకం నిర్దేశించారు.

స్థానిక ధరలపై ప్రభావం

శూన్యం ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయం కేవలం విదేశాలకు ఎగుమతి చేసే ఇంధనాలకు మాత్రమే వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు. దేశీయంగా వినియోగించే పెట్రోల్, డీజిల్ ఎక్సైజ్ సుంకాలలో ఎలాంటి మార్పు లేదు. కాబట్టి స్థానిక మార్కెట్లో వాహనదారులకు పాత ధరలే అందుబాటులో ఉంటాయి. ముడిచమురు ధరల హెచ్చుతగ్గుల ఆధారంగా ప్రతి పక్షం రోజులకోసారి ఎగుమతి సుంకాలను సమీక్షించే విధానాన్ని కేంద్రం క్రమం తప్పకుండా పాటిస్తోంది.

దేశీయ అవసరాలకే పెద్దపీట

అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో పరిణామాలను ఎప్పటికప్పుడు కేంద్రం నిశితంగా గమనిస్తోంది. ఇంధన సరఫరాలో అంతరాయం కలగకుండా ముందుజాగ్రత్తలు తీసుకుంటోంది. లాభాల కోసం కంపెనీలు ఇంధనాన్ని విదేశాలకు తరలించకుండా ఈ ఎగుమతి సుంకాలు అడ్డుకట్ట వేస్తాయి. రాబోయే సమీక్ష వరకు ఈ కొత్త రేట్లు అమల్లో ఉంటాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 03 August 2026, 9:02 pm Digital Edition : Prabhanews
Petrol Diesel Exports: పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం! | బిజినెస్

Last Updated:Aug 03, 2026 8:54 PM ISTపశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దేశీయంగా ఇంధన కొరత రాకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం (ATF) ఎగుమతులపై పన్నులను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది.News18కేంద్ర ప్రభుత్వం ఇంధన ఎగుమతులపై పన్నుల విధింపును కొనసాగిస్తూ ఆదివారం కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, అమెరికా-ఇరాన్ వివాదం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల్లో భారీ హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో దేశీయంగా పెట్రోల్, డీజిల్‌కు ఎలాంటి కొరత రాకుండా చూడటం కేంద్రం ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. ఇంధన ఎగుమతులను నిరుత్సాహపరచి, స్థానిక అవసరాలకు సరిపడా నిల్వలు ఉండేలా చూసేందుకు గత మార్చి 27న పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం (ఏటీఎఫ్) ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం (SAED), రోడ్ సెస్ అమలులోకి తెచ్చింది.సగటు అంతర్జాతీయ ముడిచమురు ధరల ఆధారంగా ప్రతి 15 రోజులకోసారి ఈ రేట్లను ప్రభుత్వం సమీక్షిస్తుంది. తాజా సమీక్ష అనంతరం రాబోయే పక్షం రోజుల పాటు ఈ పన్నులనే కొనసాగిస్తూ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.కొత్త రేట్లు ఇలా..న్యూస్18 కథనం ప్రకారం పెట్రోల్ ఎగుమతులపై లీటరుకు రూ.3.5 చొప్పున సుంకం వసూలు చేయనున్నారు. ఇది పూర్తిగా ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం కిందకే వస్తుంది. దీనిపై ఎలాంటి రోడ్ సెస్ ఉండదు. డీజిల్ ఎగుమతులపై లీటరుకు రూ.25.5 సుంకం విధించారు. ఇందులో రూ.24 ఎక్సైజ్ డ్యూటీ కాగా, రూ.1.5 రోడ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెస్ కింద వసూలు చేస్తారు. ఇక విమాన ఇంధనం (ATF)పై లీటరుకు రూ.22 ఎక్సైజ్ సుంకం నిర్దేశించారు.స్థానిక ధరలపై ప్రభావంశూన్యం ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయం కేవలం విదేశాలకు ఎగుమతి చేసే ఇంధనాలకు మాత్రమే వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు. దేశీయంగా వినియోగించే పెట్రోల్, డీజిల్ ఎక్సైజ్ సుంకాలలో ఎలాంటి మార్పు లేదు. కాబట్టి స్థానిక మార్కెట్లో వాహనదారులకు పాత ధరలే అందుబాటులో ఉంటాయి. ముడిచమురు ధరల హెచ్చుతగ్గుల ఆధారంగా ప్రతి పక్షం రోజులకోసారి ఎగుమతి సుంకాలను సమీక్షించే విధానాన్ని కేంద్రం క్రమం తప్పకుండా పాటిస్తోంది.దేశీయ అవసరాలకే పెద్దపీటఅంతర్జాతీయ ఇంధన మార్కెట్లో పరిణామాలను ఎప్పటికప్పుడు కేంద్రం నిశితంగా గమనిస్తోంది. ఇంధన సరఫరాలో అంతరాయం కలగకుండా ముందుజాగ్రత్తలు తీసుకుంటోంది. లాభాల కోసం కంపెనీలు ఇంధనాన్ని విదేశాలకు తరలించకుండా ఈ ఎగుమతి సుంకాలు అడ్డుకట్ట వేస్తాయి. రాబోయే సమీక్ష వరకు ఈ కొత్త రేట్లు అమల్లో ఉంటాయి.Location :Hyderabad,Telanganaమరింత చదవండి

Source link