Last Updated:
అణ్వాయుధాల నిల్వలో దాయాది దేశం పాకిస్థాన్ను భారత్ అధిగమించింది. మన దేశం వద్ద ప్రస్తుతం 190 అణు వార్హెడ్లు ఉన్నట్లు అమెరికాకు చెందిన ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ (FAS) సంస్థ తాజా నివేదికలో వెల్లడించింది.
అణ్వాయుధ సామర్థ్యంలో సత్తా చాటుతున్న భారతదేశం.. నిల్వల విషయంలో దాయాది పాకిస్థాన్ను వెనక్కి నెట్టింది. మన దేశ అమ్ములపొదిలో ప్రస్తుతం 190 అణు వార్హెడ్లు ఉన్నాయని అమెరికాకు చెందిన ‘ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ (FAS)’ వెల్లడించింది. పాకిస్థాన్ వద్ద 170 అణ్వాయుధాలు ఉండగా.. భారత్ వాటి సంఖ్యను 190కి పెంచుకున్నట్లు తెలిపింది. త్వరలోనే బ్రిటన్ (225) నిల్వలను కూడా మన దేశం అధిగమించే అవకాశం ఉందని ఎఫ్ఏఎస్ న్యూక్లియర్ ఇన్ఫర్మేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ హన్స్ క్రిస్టెన్సెన్ తన ‘ఇండియాస్ న్యూక్లియర్ వెపన్స్ – 2026’ నివేదికలో పేర్కొన్నారు.

