Last Updated:
భారతదేశ రియల్ ఎస్టేట్ చరిత్రలో ఒక సరికొత్త రికార్డు నమోదైంది. గురుగ్రామ్లో డీఎల్ఎఫ్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ‘ది డాలియాస్’ ప్రాజెక్టులో ఒక పెంట్హౌస్ ఏకంగా రూ.271 కోట్లకు అమ్ముడుపోయింది. సింగిల్ యూనిట్కు ఇంత భారీ ధర పలకడం ఇదే తొలిసారి.
ఢిల్లీ-ఎన్సీఆర్ రియల్ ఎస్టేట్ మార్కెట్ విలాసవంతమైన గృహాల విక్రయాల్లో ముంబైని దాటేస్తోంది. దేశంలోనే అత్యంత ఖరీదైన సింగిల్ యూనిట్ రెసిడెన్షియల్ లావాదేవీ తాజాగా గురుగ్రామ్లో నమోదైంది. ప్రముఖ రియల్ ఎస్టేట్ దిగ్గజం డీఎల్ఎఫ్ నిర్మిస్తున్న ‘ది డాలియాస్’ ప్రాజెక్టులో ఒక భారీ పెంట్హౌస్ను ఇంపీరియల్ ఆటో సంస్థతో గతంలో పనిచేసిన పారిశ్రామికవేత్త మానవ్ సర్దానా రికార్డు స్థాయిలో రూ.271 కోట్లకు కొనుగోలు చేశారు. ఈ పెంట్హౌస్ 17,200 చదరపు అడుగుల సూపర్ ఏరియా, 10,500 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాను కలిగి ఉంది.

