రోజూ 80 నుంచి 100 ఆర్డర్లు వచ్చేవి. వాటిని ఎక్కడా సమస్య రాకుండా తరలించేవారు. రోజూ 8 నుంచి 10 పార్శిళ్లను స్పీడ్ పోస్టులో పంపేవారు. ఒక్కో పార్శిల్లో 50 నుంచి 250 గ్రాముల గంజాయి పంపేవారు. ఇస్రీ బజార్, ఫుస్రో పోస్టాఫీసుల నుంచి పంపేవారు. ఇలా అక్కడి నుంచి హైదరాబాద్, ముంబై, చెన్నై, ఢిల్లీ, బెంగళూరు సహా 21 రాష్ట్రాలకు సప్లై చేసేవారు. వాట్సాప్ ద్వారా లొకేషన్లు షేర్ చేసి.. డోర్స్టెప్ డెలివరీ ఇచ్చేవారు. ఇలా రోజూ రూ.1 లక్ష సంపాదించేవారు. నెలకు రూ.30 నుంచి 35 లక్షలు, ఏడాదికి రూ.4 నుంచి 5 కోట్ల టర్నోవర్ సాధించారని పోలీసులకు తెలిసింది.

