Last Updated:
RBI Repo Rate Hike: ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకోబోతోందా? అక్టోబర్ పాలసీ సమావేశంలో రెపో రేటు పెంచే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే లోన్లు, EMIలపై ప్రభావం పడొచ్చు.
దేశంలో ద్రవ్యోల్బణ గణాంకాలు ఊహించిన దానికంటే వేగంగా పుంజుకుంటుండటంతో, భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధానంలో కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ఒకవేళ రాబోయే రోజుల్లో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ఇలాగే కొనసాగితే, రాబోయే అక్టోబర్ ద్రవ్య విధాన సమీక్ష సమావేశంలోనే ఆర్బీఐ తన ప్రధాన పాలసీ వడ్డీ రేట్లను (రెపో రేటు) పెంచే అవకాశాన్ని పరిశీలించవచ్చని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ సిటీ ఇండియా చీఫ్ ఎకనామిస్ట్ సమీరన్ చక్రవర్తి, ఐసిఐసిఐ బ్యాంక్ ఎకనామిక్స్ రీసెర్చ్ గ్రూప్ హెడ్ సమీర్ నారంగ్ నిర్వహించిన ప్రత్యేక చర్చలో ఈ కీలక విషయాలు వెల్లడయ్యాయి.

