ప్రభన్యూస్

El Nino: ఎల్‌నినోను అడ్డుకునే టెక్నాలజీ వచ్చేస్తుందా? కృత్రిమ మేఘాలతో వాతావరణాన్ని మార్చే ప్రయత్నం! |


Last Updated:

ప్రపంచవ్యాప్తంగా వేడిగాలులు, కరువు, వరదలకు కారణమవుతున్న ఎల్‌నినో ప్రభావాన్ని కృత్రిమంగా ప్రకాశవంతమైన మేఘాల ద్వారా తగ్గించే అవకాశంపై శాస్త్రవేత్తలు కీలక అధ్యయనం చేశారు.

News18
News18

ప్రపంచవ్యాప్తంగా తీవ్ర వేడి తరంగాలు, కరువు, భారీ వరదలకు కారణమయ్యే ఎల్‌నినో (El Niño) ప్రభావాన్ని ప్రారంభ దశలోనే నియంత్రించే అవకాశం ఉందా? అనే ప్రశ్నకు సమాధానం వెతుకుతూ శాస్త్రవేత్తలు ఆసక్తికర పరిశోధన చేపట్టారు. తాజాగా బుధవారం ‘సైన్స్ అడ్వాన్సెస్’ (Science Advances) జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం, సరైన సమయంలో పసిఫిక్ మహాసముద్రంపై ఉన్న మేఘాలను కృత్రిమంగా మరింత ప్రకాశవంతంగా మార్చగలిగితే ఎల్‌నినో తీవ్రతను తగ్గించే అవకాశం ఉందని కంప్యూటర్ నమూనాలు సూచించాయి.

చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకురాలు జెస్సికా వాన్ నేతృత్వంలోని బృందం ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. ఇప్పటివరకు జియో ఇంజినీరింగ్‌పై జరిగిన పరిశోధనలు భూమి మొత్తం ఉష్ణోగ్రతను తగ్గించడంపై దృష్టి పెట్టగా, ఈ కొత్త అధ్యయనం మాత్రం ప్రత్యేకంగా ఎల్‌నినో ఏర్పడే ప్రాంతాన్నే లక్ష్యంగా చేసుకుని జోక్యం చేసుకోవచ్చనే అంశాన్ని ప్రతిపాదించింది.

ఈ పరిశోధనకు ప్రేరణగా 2019-20లో ఆస్ట్రేలియాలో సంభవించిన ‘బ్లాక్ సమ్మర్’ అటవీ అగ్నిప్రమాదాలు నిలిచాయి. ఆ సమయంలో పొగ కణాలు మేఘాల్లో కలవడంతో మేఘాలు మరింత ప్రకాశవంతంగా మారి సూర్యకిరణాలను అంతరిక్షంలోకి ఎక్కువగా ప్రతిఫలించాయి. ఈ సహజ పరిణామం తరువాతి సంవత్సరాల్లో లా నినా పరిస్థితులు ఏర్పడటానికి దోహదపడిందని గత పరిశోధనలు సూచించాయి.

ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు సముద్ర జలాల్లోని ఉప్పును ప్రత్యేక నాజిళ్ల ద్వారా వాతావరణంలోకి పిచికారీ చేసి మేఘాలను ప్రకాశవంతంగా మార్చే మరైన్ క్లౌడ్ బ్రైటెనింగ్ విధానాన్ని కంప్యూటర్ మోడళ్ల ద్వారా పరీక్షించారు. 1997-98, 2015-16లో సంభవించిన బలమైన ఎల్‌నినో పరిస్థితులపై ఈ విధానం ఎలా పనిచేసేదో విశ్లేషించారు. పరిశోధన ప్రకారం, జూన్ నెలలో ఈ ప్రక్రియ ప్రారంభించి తదుపరి ఏడాది ఫిబ్రవరి వరకు కొనసాగిస్తే ఉత్తమ ఫలితాలు వచ్చే అవకాశం ఉందని తేలింది.

ఎల్‌నినో కారణంగా తూర్పు ఉష్ణమండల పసిఫిక్ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగి ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు సంభవిస్తాయి. ఆస్ట్రేలియాలో కరువు, తూర్పు ఆఫ్రికాలో అధిక వర్షాలు, ప్రపంచ సగటు ఉష్ణోగ్రతల పెరుగుదల వంటి ప్రభావాలు కనిపిస్తాయి. తాజా అధ్యయనంలో మేఘాలను ప్రకాశవంతం చేయడం వల్ల ఎల్‌నినో ప్రభావంతో వేడెక్కే ప్రాంతాలు చల్లబడటం, అధిక వర్షాలు పడే ప్రాంతాల్లో వర్షపాతం తగ్గడం, పొడి ప్రాంతాల్లో తేమ పెరగడం వంటి మార్పులు కనిపించినట్లు పరిశోధకులు పేర్కొన్నారు.

అయితే ఈ సాంకేతికత ప్రస్తుతం ఆచరణలోకి తీసుకురావడానికి సిద్ధంగా లేదని పరిశోధకులు స్పష్టం చేశారు. సముద్రపు ఉప్పును భారీ స్థాయిలో వాతావరణంలోకి పంపే నాజిళ్ల అభివృద్ధి ఇంకా కొనసాగుతోంది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపాలంటే సుమారు 2,400 ప్రత్యేక నౌకలు అవసరమవుతాయని అంచనా. మరోవైపు యూరప్, ఆసియాలో అనుకోని ఉష్ణోగ్రత పెరుగుదల వంటి ప్రతికూల ప్రభావాలు కూడా కంప్యూటర్ నమూనాల్లో కనిపించాయి. దీర్ఘకాలంగా ఈ విధానాన్ని పదేపదే ఉపయోగిస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయన్నది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

జియో ఇంజినీరింగ్‌పై కొందరు నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సాంకేతికత అందుబాటులోకి వస్తే కాలుష్య ఉద్గారాలను తగ్గించే ప్రయత్నాలు బలహీనపడే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. అయితే జెస్సికా వాన్ అభిప్రాయం ప్రకారం, వాతావరణ మార్పులు ఇప్పటికే ప్రారంభమైన నేపథ్యంలో దీర్ఘకాలిక పరిష్కారాలతో పాటు తీవ్ర ప్రభావాలను తగ్గించే మార్గాలపై కూడా పరిశోధనలు కొనసాగాల్సిన అవసరం ఉందని చెప్పారు.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 09 July 2026, 11:08 pm Digital Edition : Prabhanews
El Nino: ఎల్‌నినోను అడ్డుకునే టెక్నాలజీ వచ్చేస్తుందా? కృత్రిమ మేఘాలతో వాతావరణాన్ని మార్చే ప్రయత్నం! |

Last Updated:Jul 09, 2026 10:17 PM ISTప్రపంచవ్యాప్తంగా వేడిగాలులు, కరువు, వరదలకు కారణమవుతున్న ఎల్‌నినో ప్రభావాన్ని కృత్రిమంగా ప్రకాశవంతమైన మేఘాల ద్వారా తగ్గించే అవకాశంపై శాస్త్రవేత్తలు కీలక అధ్యయనం చేశారు.News18ప్రపంచవ్యాప్తంగా తీవ్ర వేడి తరంగాలు, కరువు, భారీ వరదలకు కారణమయ్యే ఎల్‌నినో (El Niño) ప్రభావాన్ని ప్రారంభ దశలోనే నియంత్రించే అవకాశం ఉందా? అనే ప్రశ్నకు సమాధానం వెతుకుతూ శాస్త్రవేత్తలు ఆసక్తికర పరిశోధన చేపట్టారు. తాజాగా బుధవారం 'సైన్స్ అడ్వాన్సెస్' (Science Advances) జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం, సరైన సమయంలో పసిఫిక్ మహాసముద్రంపై ఉన్న మేఘాలను కృత్రిమంగా మరింత ప్రకాశవంతంగా మార్చగలిగితే ఎల్‌నినో తీవ్రతను తగ్గించే అవకాశం ఉందని కంప్యూటర్ నమూనాలు సూచించాయి.చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకురాలు జెస్సికా వాన్ నేతృత్వంలోని బృందం ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. ఇప్పటివరకు జియో ఇంజినీరింగ్‌పై జరిగిన పరిశోధనలు భూమి మొత్తం ఉష్ణోగ్రతను తగ్గించడంపై దృష్టి పెట్టగా, ఈ కొత్త అధ్యయనం మాత్రం ప్రత్యేకంగా ఎల్‌నినో ఏర్పడే ప్రాంతాన్నే లక్ష్యంగా చేసుకుని జోక్యం చేసుకోవచ్చనే అంశాన్ని ప్రతిపాదించింది.ఈ పరిశోధనకు ప్రేరణగా 2019-20లో ఆస్ట్రేలియాలో సంభవించిన 'బ్లాక్ సమ్మర్' అటవీ అగ్నిప్రమాదాలు నిలిచాయి. ఆ సమయంలో పొగ కణాలు మేఘాల్లో కలవడంతో మేఘాలు మరింత ప్రకాశవంతంగా మారి సూర్యకిరణాలను అంతరిక్షంలోకి ఎక్కువగా ప్రతిఫలించాయి. ఈ సహజ పరిణామం తరువాతి సంవత్సరాల్లో లా నినా పరిస్థితులు ఏర్పడటానికి దోహదపడిందని గత పరిశోధనలు సూచించాయి.ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు సముద్ర జలాల్లోని ఉప్పును ప్రత్యేక నాజిళ్ల ద్వారా వాతావరణంలోకి పిచికారీ చేసి మేఘాలను ప్రకాశవంతంగా మార్చే మరైన్ క్లౌడ్ బ్రైటెనింగ్ విధానాన్ని కంప్యూటర్ మోడళ్ల ద్వారా పరీక్షించారు. 1997-98, 2015-16లో సంభవించిన బలమైన ఎల్‌నినో పరిస్థితులపై ఈ విధానం ఎలా పనిచేసేదో విశ్లేషించారు. పరిశోధన ప్రకారం, జూన్ నెలలో ఈ ప్రక్రియ ప్రారంభించి తదుపరి ఏడాది ఫిబ్రవరి వరకు కొనసాగిస్తే ఉత్తమ ఫలితాలు వచ్చే అవకాశం ఉందని తేలింది.ఎల్‌నినో కారణంగా తూర్పు ఉష్ణమండల పసిఫిక్ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగి ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు సంభవిస్తాయి. ఆస్ట్రేలియాలో కరువు, తూర్పు ఆఫ్రికాలో అధిక వర్షాలు, ప్రపంచ సగటు ఉష్ణోగ్రతల పెరుగుదల వంటి ప్రభావాలు కనిపిస్తాయి. తాజా అధ్యయనంలో మేఘాలను ప్రకాశవంతం చేయడం వల్ల ఎల్‌నినో ప్రభావంతో వేడెక్కే ప్రాంతాలు చల్లబడటం, అధిక వర్షాలు పడే ప్రాంతాల్లో వర్షపాతం తగ్గడం, పొడి ప్రాంతాల్లో తేమ పెరగడం వంటి మార్పులు కనిపించినట్లు పరిశోధకులు పేర్కొన్నారు.అయితే ఈ సాంకేతికత ప్రస్తుతం ఆచరణలోకి తీసుకురావడానికి సిద్ధంగా లేదని పరిశోధకులు స్పష్టం చేశారు. సముద్రపు ఉప్పును భారీ స్థాయిలో వాతావరణంలోకి పంపే నాజిళ్ల అభివృద్ధి ఇంకా కొనసాగుతోంది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపాలంటే సుమారు 2,400 ప్రత్యేక నౌకలు అవసరమవుతాయని అంచనా. మరోవైపు యూరప్, ఆసియాలో అనుకోని ఉష్ణోగ్రత పెరుగుదల వంటి ప్రతికూల ప్రభావాలు కూడా కంప్యూటర్ నమూనాల్లో కనిపించాయి. దీర్ఘకాలంగా ఈ విధానాన్ని పదేపదే ఉపయోగిస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయన్నది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.జియో ఇంజినీరింగ్‌పై కొందరు నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సాంకేతికత అందుబాటులోకి వస్తే కాలుష్య ఉద్గారాలను తగ్గించే ప్రయత్నాలు బలహీనపడే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. అయితే జెస్సికా వాన్ అభిప్రాయం ప్రకారం, వాతావరణ మార్పులు ఇప్పటికే ప్రారంభమైన నేపథ్యంలో దీర్ఘకాలిక పరిష్కారాలతో పాటు తీవ్ర ప్రభావాలను తగ్గించే మార్గాలపై కూడా పరిశోధనలు కొనసాగాల్సిన అవసరం ఉందని చెప్పారు.Click here to add News18 as your preferred news source on Google. బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.Location :Hyderabad,TelanganaFirst Published :Jul 09, 2026 10:17 PM ISTమరింత చదవండి

Source link