ముంబై సమీప ప్రాంతాల్లో స్థానిక భాషలో మాట్లాడలేని బ్యాంకు సిబ్బందిపై కొన్ని హింసాత్మక ఘటనలు జరిగిన నేపథ్యంలో ఈ ప్రకటన వచ్చింది. ఈ అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025 నవంబర్లో బ్యాంకులకు సూచనలు చేశారు. స్థానిక భాష విషయంలో బ్యాంకులు సున్నితంగా వ్యవహరించాలని ఆమె చెప్పారు. అవసరమైతే తమ హ్యూమన్ రిసోర్సెస్ (హెచ్ఆర్) విధానాల్లో మార్పులు చేయాలని కూడా సూచించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా సహా మొత్తం 20 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ నియామకాలు ఉంటాయని బ్యాంక్ ఆఫ్ బరోడా తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
