Last Updated:
మీ భవిష్యత్తు కోసం, రిటైర్మెంట్ తర్వాత భద్రత కోసం నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)లో పెట్టుబడి పెడుతున్నారా? అయితే మీకో ముఖ్యమైన గమనిక. రాబోయే అక్టోబర్ 1, 2026 నుండి ఎన్పీఎస్ ఛార్జీల నిర్మాణంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి.
మీ భవిష్యత్తు కోసం, రిటైర్మెంట్ తర్వాత భద్రత కోసం నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)లో పెట్టుబడి పెడుతున్నారా? అయితే మీకో ముఖ్యమైన గమనిక. రాబోయే అక్టోబర్ 1, 2026 నుండి ఎన్పీఎస్ ఛార్జీల నిర్మాణంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (PFRDA) ఈ కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. ముఖ్యంగా పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్ (PoP) సేవల ద్వారా ఎన్పీఎస్ ఖాతాలను నిర్వహిస్తున్న చందాదారులపై ఈ సవరించిన ఛార్జీలు ప్రభావం చూపనున్నాయి. ఈ మార్పులు సాధారణ ఎన్పీఎస్ పథకాలతో పాటుగా ఎన్పీఎస్ లైట్ విధానానికి కూడా వర్తిస్తాయని పీఎఫ్ఆర్డీఏ (PFRDA) స్పష్టం చేసింది.

