Last Updated:
Mann Ki Baat 137th Episode:ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ప్రతీ నెలా ఆల్ ఇండియా రేడియో ద్వారా.. తన మనసులో మాటను ప్రజలతో పంచుకుంటున్నారు. ఆగస్టు 30న మన్కీ బాత్ కార్యక్రమం ద్వారా తన మనసులోని మాటను దేశ ప్రజలతో పంచుకున్నాడు. మరి మోదీ ఎమన్నారో తెలుసుకుందాం.
భారతదేశం ‘వికసిత్ భారత్’ (అభివృద్ధి చెందిన దేశం)గా రూపాంతరం చెందాలంటే దేశం తప్పనిసరిగా ‘మాదకద్రవ్య రహితం’గా మారాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశ భవిష్యత్తును కాపాడటమే తమ ప్రభుత్వ దృఢ సంకల్పమని ఆయన పేర్కొన్నారు. తన నెలవారీ రేడియో ప్రసంగ కార్యక్రమం ‘మన్ కీ బాత్’ 137వ ఎపిసోడ్ ద్వారా దేశ ప్రజలనుద్దేశించి ప్రధాని మాట్లాడారు. డ్రగ్స్ రహిత యువత, మత్తు లేని భారతదేశాన్ని నిర్మించడమే ప్రభుత్వ స్పష్టమైన లక్ష్యమని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘వికసిత్ భారత్ కోసం నషా-ముక్త్ యువ’ ప్రచార కార్యక్రమాన్ని ఆయన కొనియాడారు. పెద్ద సంఖ్యలో ప్రజలు, ముఖ్యంగా యువత ఈ ప్రచారంలో ఉత్సాహంగా భాగస్వాములవుతున్నారని హర్షం వ్యక్తం చేశారు.

