వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి ఖరే మంగళవారం సోషల్ మీడియాలో ఈ విషయం తెలిపారు. ‘కందా ఎక్స్ప్రెస్’ ద్వారా సుమారు 800 టన్నుల ఉల్లిపాయలు ఢిల్లీకి వస్తున్నాయని, వీటిని నాఫెడ్, ఎన్సీసీఎఫ్, కేంద్ర భండార్ దుకాణాల్లో కిలో రూ.35 చొప్పున విక్రయిస్తామని ఆమె చెప్పారు. భారీ మొత్తంలో ఉల్లిపాయలను ప్రత్యేక రైల్వే రేకుల ద్వారా మరో నాలుగు నగరాలకు కూడా తరలిస్తున్నారు. చెన్నై, ఎర్నాకుళం, మదురై, గువాహటికి ఈ సరఫరా జరుగుతోంది. ఈ నగరాలకు తరలిస్తున్న ఉల్లిపాయలు మహారాష్ట్రలోని నాసిక్లో నిల్వ చేసిన బఫర్ స్టాక్లో భాగమే. ధరలు మరింత పెరగకుండా చూడటానికి ఈ నిల్వలను ఇప్పుడు మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
