Last Updated:
భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ దాడుల్లో ధ్వంసమైన పాకిస్థాన్లోని జైషే మహ్మద్ ఉగ్రవాద స్థావరం మళ్లీ ఏర్పాటైంది. ఐఎస్ఐ (ISI) సహకారంతో బహావల్పూర్లోని ఈ హెడ్క్వార్టర్స్ను ఏకంగా 25 కోట్ల రూపాయలతో పునర్నిర్మించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.
భారత బలగాలు జరిపిన ‘ఆపరేషన్ సిందూర్’ దాడుల్లో ధ్వంసమైన పాకిస్థాన్లోని బహావల్పూర్లో ఉన్న జైషే మహ్మద్ (JeM) ఉగ్రవాద ప్రధాన స్థావరం మళ్లీ పూర్తి స్థాయిలో ఏర్పాటైంది. దాడులు జరిగిన సుమారు 15 నెలల తర్వాత ఈ ఉగ్రవాద కేంద్రం పునర్నిర్మాణం పూర్తి చేసుకున్నట్లు భారత నిఘా వర్గాలు గుర్తించాయని న్యూస్18 ఇంగ్లీష్ పేర్కొంది. పాకిస్థాన్ ప్రభుత్వం, ఐఎస్ఐ ఏజెన్సీలు సుమారు 25 కోట్ల రూపాయలు కేటాయించి ఈ భవనాన్ని నిర్మించినట్లు సమాచారం. ఇందులో 11 కోట్ల రూపాయలను కేవలం మర్కజ్ సుభానల్లాలోని సెంట్రల్ హాల్ మరమ్మతుల కోసమే ఖర్చు చేశారని నిఘా వర్గాలు తెలిపాయి.

