ఇప్పుడు కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ కొత్తగా ప్రకటించిన ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్స్ స్కీమ్, 2026 ప్రకారం నెలకు రూ.15,000 వేతన పరిమితిని మించిన భాగంపై ఈపీఎఫ్ చందాలు చెల్లించడం స్వచ్ఛందంగా మారింది. ఇంతకుముందు అమల్లో ఉన్న ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్స్ స్కీమ్, 1952 ప్రకారం నెలకు రూ.15,000 వరకు సంపాదించే ఉద్యోగులు ఈపీఎఫ్లో తప్పనిసరిగా ఉండాల్సి వచ్చేది. రూ.15,000 కంటే ఎక్కువ వేతనం తీసుకునే ఉద్యోగులు ఇష్టపడి పథకంలో చేరవచ్చు. ఒకసారి చేరిన తర్వాత, ఉద్యోగి నిజమైన ప్రాథమిక వేతనం ఎంత ఉంటే దాని ఆధారంగానే ఉద్యోగి, యజమాని ఇద్దరూ చందాలు చెల్లించేవారు. అది ప్రభుత్వం నిర్ణయించిన వేతన పరిమితిని మించినా కూడా అదే విధానం కొనసాగేది. (ప్రతీకాత్మక చిత్రం)

