ప్రయాణికుల సౌకర్యం కోసం ఈ ప్రత్యేక రైళ్లు రెండు దిశల్లో ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతాయి. ఈ రైళ్లకు థానే, కల్యాణ్, లోనావాలా, పుణె, దౌండ్, సోలాపూర్, కలబురగి, వాడి, యాదగిరి, కృష్ణ, రాయిచూర్, మంత్రాలయం రోడ్, ఆదోని, గుంతకల్, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట, కాట్పాడి, తిరువణ్ణామలై, విల్లుపురం, మయిలాడుతురై జంక్షన్, నాగపట్నం స్టేషన్లలో హాల్టులు ఉంటాయి. వేలాంకన్ని ఫెస్టివల్ సమయంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు ఈ ప్రత్యేక రైళ్ల ద్వారా సులభంగా ప్రయాణించేందుకు ఈ స్టాప్లను ఏర్పాటు చేశారు. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రత్యేక రైళ్లలో వివిధ రకాల కోచ్లను ఏర్పాటు చేశారు. ఇందులో ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)

