ఉదాహరణకు, ఒక వ్యక్తి ప్రతి నెల రూ.12,000 చొప్పున మ్యూచువల్ ఫండ్స్లో SIP ద్వారా పెట్టుబడి పెడుతున్నారని, సంవత్సరానికి సగటున 12 శాతం రాబడి వస్తుందని అనుకుందాం. ఈ లెక్కల ప్రకారం, 10 సంవత్సరాల్లో అతను మొత్తం రూ.14.40 లక్షలు పెట్టుబడి పెడతాడు. ఆ పెట్టుబడి విలువ సుమారు రూ.26.6 లక్షలకు చేరే అవకాశం ఉంటుంది. ఇదే పెట్టుబడిని 20 సంవత్సరాలు కొనసాగిస్తే, మొత్తం పెట్టుబడి రూ.28.80 లక్షలు కాగా, కాంపౌండింగ్ ప్రభావంతో దాని విలువ సుమారు రూ.1.10 కోట్లకు పెరిగే అవకాశం ఉంది. ఇంకా ఓపికగా 25 సంవత్సరాలు SIP కొనసాగిస్తే, మొత్తం పెట్టుబడి కేవలం రూ.36 లక్షలు మాత్రమే అయినప్పటికీ, దాని అంచనా విలువ సుమారు రూ.2.04 కోట్లకు చేరవచ్చు. ఈ లెక్కలు చూస్తే, దీర్ఘకాలిక పెట్టుబడుల్లో కాంపౌండింగ్ ఎంత శక్తివంతంగా పనిచేస్తుందో స్పష్టంగా అర్థమవుతుంది. పెట్టుబడి చేసిన మొత్తం కంటే, ఆ పెట్టుబడిపై వచ్చిన లాభాలకు మళ్లీ లాభాలు చేరడం వల్లే సంపద వేగంగా పెరుగుతుంది. అందుకే SIPలో తక్కువ మొత్తంతో ప్రారంభించినా, క్రమశిక్షణతో చాలా సంవత్సరాలు కొనసాగిస్తే కోట్ల రూపాయల సంపదను సృష్టించే అవకాశం ఉంటుంది.

