ప్రభన్యూస్

ప్రజల ప్రాణాలతో చెలగాటమా..? గుంతలమయమైన కా మారెడ్డి ప్రధాన రహదారులపై అధికారుల నిర్లక్ ష్యం ఎంతకాలం..?

ప్రజల ప్రాణాలతో చెలగాటమా..? గుంతలమయమైన కామారెడ్డి ప్రధాన రహదారులపై అధికారుల నిర్లక్ష్యం ఎంతకాలం..?

కొత్త బస్టాండ్–రైల్వే గేట్ మార్గం దుస్థితి.. వర్షాలతో మరింత ప్రమాదకరంగా మారిన రహదారులు.. తక్షణ మరమ్మతులు చేపట్టాలని ప్రజల డిమాండ్

ప్రభ న్యూస్ | కామారెడ్డి | జూలై 21:

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారులు రోజురోజుకూ అధ్వానంగా మారుతూ ప్రజలకు నరకయాతనను మిగులుస్తున్నాయి. ముఖ్యంగా కొత్త బస్టాండ్ నుంచి రైల్వే గేట్ వరకు, అలాగే గాంధారమ్మ ఆసుపత్రి వైపు వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయంగా మారడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలంలో పరిస్థితి మరింత దిగజారి, ఈ రహదారులపై ప్రయాణం ప్రాణాలకు సవాలుగా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇటీవలి వర్షాలతో రహదారులపై భారీగా నీరు నిల్వ ఉండటంతో గుంతలు కనిపించకుండా పోతున్నాయి.


దీంతో ద్విచక్ర వాహనదారులు అదుపు తప్పి ప్రమాదాలకు గురయ్యే ప్రమాదం రోజురోజుకూ పెరుగుతోంది. ఈ మార్గంలో ప్రతిరోజూ ప్రయాణించే విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, ఆసుపత్రులకు వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వాపోతున్నారు.ఈ సమస్యపై పలుమార్లు సంబంధిత శాఖ అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ శాశ్వత పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. గుంతలను తాత్కాలికంగా పూడ్చడం కాకుండా నాణ్యమైన రహదారిని నిర్మించి ప్రజలకు సురక్షితమైన రవాణా సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.వర్షాకాలం కొనసాగుతున్న నేపథ్యంలో గుంతల్లో నీరు నిల్వ ఉండటం వల్ల ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనన్న భయంతో ప్రజలు ప్రయాణిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో గుంతలు కనిపించకపోవడంతో ప్రమాదాల ముప్పు మరింత పెరుగుతోందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారుల దుస్థితి ప్రజల భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతున్నప్పటికీ సంబంధిత అధికారులు స్పందించకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి అత్యవసరంగా రహదారి మరమ్మత్తులు చేపట్టి, ప్రజలకు సురక్షితమైన ప్రయాణ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన ఈ గుంతల సమస్యకు అధికారులు ఎప్పుడు శాశ్వత పరిష్కారం చూపుతారు? ప్రధాన రహదారులకు మళ్లీ మంచి రోజులు ఎప్పుడు వస్తాయి? అనే ప్రశ్నలకు సమాధానం కోసం కామారెడ్డి ప్రజలు ఎదురుచూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 22 July 2026, 9:06 am Digital Edition : Prabhanews
ప్రజల ప్రాణాలతో చెలగాటమా..? గుంతలమయమైన కా మారెడ్డి ప్రధాన రహదారులపై అధికారుల నిర్లక్ ష్యం ఎంతకాలం..?

ప్రజల ప్రాణాలతో చెలగాటమా..? గుంతలమయమైన కామారెడ్డి ప్రధాన రహదారులపై అధికారుల నిర్లక్ష్యం ఎంతకాలం..?

కొత్త బస్టాండ్–రైల్వే గేట్ మార్గం దుస్థితి.. వర్షాలతో మరింత ప్రమాదకరంగా మారిన రహదారులు.. తక్షణ మరమ్మతులు చేపట్టాలని ప్రజల డిమాండ్

ప్రభ న్యూస్ | కామారెడ్డి | జూలై 21:

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారులు రోజురోజుకూ అధ్వానంగా మారుతూ ప్రజలకు నరకయాతనను మిగులుస్తున్నాయి. ముఖ్యంగా కొత్త బస్టాండ్ నుంచి రైల్వే గేట్ వరకు, అలాగే గాంధారమ్మ ఆసుపత్రి వైపు వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయంగా మారడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలంలో పరిస్థితి మరింత దిగజారి, ఈ రహదారులపై ప్రయాణం ప్రాణాలకు సవాలుగా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇటీవలి వర్షాలతో రహదారులపై భారీగా నీరు నిల్వ ఉండటంతో గుంతలు కనిపించకుండా పోతున్నాయి.

దీంతో ద్విచక్ర వాహనదారులు అదుపు తప్పి ప్రమాదాలకు గురయ్యే ప్రమాదం రోజురోజుకూ పెరుగుతోంది. ఈ మార్గంలో ప్రతిరోజూ ప్రయాణించే విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, ఆసుపత్రులకు వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వాపోతున్నారు.ఈ సమస్యపై పలుమార్లు సంబంధిత శాఖ అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ శాశ్వత పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. గుంతలను తాత్కాలికంగా పూడ్చడం కాకుండా నాణ్యమైన రహదారిని నిర్మించి ప్రజలకు సురక్షితమైన రవాణా సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.వర్షాకాలం కొనసాగుతున్న నేపథ్యంలో గుంతల్లో నీరు నిల్వ ఉండటం వల్ల ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనన్న భయంతో ప్రజలు ప్రయాణిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో గుంతలు కనిపించకపోవడంతో ప్రమాదాల ముప్పు మరింత పెరుగుతోందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారుల దుస్థితి ప్రజల భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతున్నప్పటికీ సంబంధిత అధికారులు స్పందించకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి అత్యవసరంగా రహదారి మరమ్మత్తులు చేపట్టి, ప్రజలకు సురక్షితమైన ప్రయాణ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన ఈ గుంతల సమస్యకు అధికారులు ఎప్పుడు శాశ్వత పరిష్కారం చూపుతారు? ప్రధాన రహదారులకు మళ్లీ మంచి రోజులు ఎప్పుడు వస్తాయి? అనే ప్రశ్నలకు సమాధానం కోసం కామారెడ్డి ప్రజలు ఎదురుచూస్తున్నారు.