ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. దీనికి అనారోగ్యకరమైన జీవనశైలి, సమతుల్య ఆహారం తీసుకోకపోవడం, వ్యాయామం లేకపోవడం, ధూమపానం, మద్యం సేవించడం, కాలుష్యం, మానసిక ఒత్తిడి వంటి అంశాలను వైద్యులు చెబుతున్నారు. అయితే సోషల్ మీడియాలో క్యాన్సర్కు సంబంధించిన అనేక అపోహలు కూడా ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా గ్యాస్ స్టవ్పై కాల్చిన చపాతీలు తింటే క్యాన్సర్ వస్తుందని, లేదా గ్యాస్లోని రసాయనాలు చపాతీలోకి చేరతాయని చాలామంది నమ్ముతుంటారు. కానీ ఈ ప్రచారంలో నిజం లేదని రాయ్పూర్కు చెందిన ప్రముఖ క్యాన్సర్ వైద్యుడు డాక్టర్ జయేష్ శర్మ స్పష్టం చేస్తున్నారు.

