ఈ పథకానికి మానిటరింగ్, ఎవాల్యుయేషన్, లెర్నింగ్ అండ్ ఇంపాక్ట్ అసెస్మెంట్ (MELIA) ప్లాట్ఫామ్, కేంద్ర డేటా నిర్వహణ వ్యవస్థ, జ్ఞాన ప్రచారం, కమ్యూనికేషన్ వ్యూహం, జాతీయ లింగ సమానత్వ వేదికలు మద్దతుగా ఉంటాయని జాట్ తెలిపారు. ప్రధాని సూచనల మేరకు ఐసీఏఆర్ రాష్ట్రాల వారీగా శాస్త్రీయ ఆధారాలతో వ్యవసాయ రోడ్మ్యాప్లను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, అసోం, మహారాష్ట్ర, గోవా తర్వాత పశ్చిమ బెంగాల్ రోడ్మ్యాప్ను ఈ వారం విడుదల చేశారు. మిగిలిన రాష్ట్రాలకు కూడా త్వరలో రోడ్మ్యాప్లు సిద్ధం చేస్తామని జాట్ తెలిపారు. గత ఏడాది పనితీరును సమీక్షించిన ఐసీఏఆర్, ఆహార ధాన్యాల ఉత్పత్తి 1.9 కోట్ల టన్నులు పెరిగిందని తెలిపింది. దీని విలువ సుమారు రూ.60,000 కోట్లుగా అంచనా వేసింది. 2001 నుంచి 2014-15 మధ్య నమోదైన వృద్ధితో పోలిస్తే గత 12 ఏళ్లలో ఉత్పత్తి మూడు రెట్లు కంటే ఎక్కువ పెరిగిందని పేర్కొంది. (ప్రతీకాత్మక చిత్రం)

