ఈ కొత్త ఫీచర్ లాంచింగ్ సందర్భంగా ఇక్సిగో కో ఫౌండర్ అండ్ గ్రూప్ కో సీఈఓ రజ్నీష్ కుమార్, కో ఫౌండర్ అండ్ గ్రూప్ సీఈఓ అలోక్ బాజ్పాయ్ మాట్లాడుతూ, “ప్రయాణికులు తరచూ ఒకే రూట్ను చాలాసార్లు చెక్ చేస్తూ ఉంటారు. ధరలు ఎప్పుడు తగ్గుతాయో అని ఎదురుచూస్తుంటారు. స్మార్ట్ లాక్ ద్వారా ఆ కష్టాన్ని ప్రయాణికుల నుంచి ఏఐ ఏజెంట్లకు మారుస్తున్నాం. ఎక్కడికి వెళ్లాలి, ఎప్పుడు వెళ్లాలి, ఎంత ఖర్చు పెట్టగలరు అనే వివరాలు చెబితే చాలని, మా స్మార్ట్ లాక్ ఏజెంట్ బ్యాక్గ్రౌండ్లో అటానమస్గా పనిచేసి సరైన ధర దొరికినప్పుడు వెంటనే స్పందిస్తుంది. కేవలం సెర్చ్ చేసి బుక్ చేయడమే కాకుండా, ప్రయాణికుల ఆలోచనను అర్థం చేసుకుని పని చేసే ఏఐ నేటివ్ పీస్ ఆఫ్ మైండ్ ట్రావెల్ యాప్ను తీర్చిదిద్దడంలో ఇది మరో ముందడుగు” అని అన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)

