Last Updated:
ఉద్యోగులకు కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో EPFOలో కీలక మార్పు రాబోతోంది. సెప్టెంబర్ 17 నుంచి అమల్లోకి వచ్చే ఈ నిర్ణయంతో 51 లక్షల మంది ఉద్యోగులకు ఎలా ప్రయోజనం కలగనుంది? PFతో పాటు పెన్షన్, బీమా ప్రయోజనాల్లో ఏ మార్పులు ఉండబోతున్నాయో తెలుసుకోండి.
ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) పరిధిలో తప్పనిసరి కవరేజీకి వర్తించే నెలవారీ వేతన పరిమితిని రూ.15,000 నుంచి రూ.25,000కు పెంచేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ చేసిన ప్రతిపాదనకు బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఆమోదముద్ర పడింది. ఈ నిర్ణయం వల్ల దాదాపు 51 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం కలగనుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దీనివల్ల ప్రభుత్వంపై రూ.11,339 కోట్ల వ్యయం అవుతుందని వెల్లడించారు.

