నమో భారత్ ఆర్ఆర్టీఎస్: ఢిల్లీ-మీరట్ రీజినల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్ఆర్టీఎస్) మార్గంలో నడిచే నమో భారత్ రైళ్లు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. వీటి డిజైన్ వేగం గంటకు 180 కిలోమీటర్లు. ఈ వ్యవస్థను నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (ఎన్సీఆర్టీసీ) అమలు చేస్తోంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు భాగస్వాములుగా ఉన్నాయి. ఈ రైళ్లు సాధారణ రైల్వే మార్గాలు, రోడ్డు ట్రాఫిక్కు వేరుగా ప్రత్యేక ట్రాక్లపై నడుస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)

