Last Updated:
PM Modi Brics Schedule: దేశ రాజధాని న్యూఢిల్లీ ఆతిథ్యమిస్తున్న బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుడిగాలి దౌత్య చర్చలకు సిద్ధమయ్యారు.
సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు మూడు రోజుల పాటు బ్రిక్స్, భాగస్వామ్య దేశాల అగ్రనేతలతో ఆయన మొత్తం 15 ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొననున్నారు. ఈ మేరకు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక షెడ్యూల్ను విడుదల చేసింది. ఇరాన్ యుద్ధం, హోర్ముజ్ జలసంధి పరిసరాల్లో ఉద్రిక్తతలు, భారత్-చైనా సంబంధాలు, అమెరికా-రష్యా-చైనా మధ్య నడుస్తున్న అంతర్జాతీయ పోటీ వంటి క్లిష్ట పరిస్థితుల నడుమ భారత్ విదేశాంగ విధానానికి ఈ భేటీలు అత్యంత కీలకంగా మారాయి.

