సింగరేణిని నిలువునా ముంచేసిన ఆ 2 పార్టీలు.. కిషన్ రెడ్డి ఫైర్ | తెలంగాణ వార్తలు


Last Updated:

కేసీఆర్ జేబు సంస్థగా సింగరేణి.. రేవంత్ సర్కార్ కూడా అంతే.. సింగరేణి కార్మికుల ముందు అసలు గుట్టు విప్పిన కిషన్ రెడ్డి.

+

News18

News18

తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి సంస్థను గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు రెండు తీవ్రంగా దెబ్బతీశాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. భూపాలపల్లి జిల్లాలో ఆయన సింగరేణి భరోసా యాత్రను నిర్వహించారు. ఇందులో భాగంగా కేటీకే 8 బొగ్గు గనిని స్వయంగా సందర్శించిన ఆయన, సింగరేణి కార్మికులు, వాళ్ల కుటుంబ సభ్యులతో ముఖాముఖిగా మాట్లాడారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల తప్పుడు విధానాల వల్లే కార్మికుల్లో ఆత్మవిశ్వాసం, భద్రతాభావం సన్నగిల్లాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోనే అత్యంత కీలకమైన ఈ ప్రభుత్వ రంగ సంస్థను బలోపేతం చేయాల్సింది పోయి, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే వాడుకున్నారని మండిపడ్డారు.

సింగరేణికి రావాల్సిన బకాయిల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాల తీరును కిషన్ రెడ్డి తప్పుబట్టారు. తెలంగాణ జెన్కోకు సరఫరా చేసిన బొగ్గుకు గాను సింగరేణికి దాదాపు తొమ్మిది వేల కోట్లు రావాల్సి ఉందని, దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో జెన్కోకు రూ.8,958 కోట్ల అప్పు ఇస్తే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా రూ.26,875 కోట్ల మేర అప్పు చేసి సంస్థపై తీవ్రమైన ఆర్థిక భారం మోపాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కోసం కేంద్రాన్ని బెదిరించే ధోరణి అవలంబిస్తోందని విమర్శించారు. కేంద్రం అందించిన డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ నిధుల వినియోగం పట్ల తెలంగాణ ప్రభుత్వం పూర్తి పారదర్శకత పాటించాలని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: Ration Card: రేషన్ కార్డు ఉన్న వారికి భారీ శుభవార్త.. ప్రభుత్వం అదిరిపోయే కీలక ప్రకటన!

కేసీఆర్ పదేళ్ల పాలనలో సింగరేణి సంస్థ 15 ఏళ్లు వెనక్కి వెళ్లిందని కేంద్ర మంత్రి విమర్శించారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేసీఆర్ ఒక్కరోజైనా సింగరేణి అభివృద్ధి కోసం కేంద్రాన్ని సంప్రదించలేదని, సంస్థను కల్వకుంట్ల కుటుంబం సొంత జేబు సంస్థగా మార్చుకుందని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అచ్చం అలాగే వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. కానీ, తాడిచర్ల 2 బొగ్గు బ్లాక్ ను సింగరేణికి కేటాయించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం.. సింగరేణిని కాపాడటం, కార్మికుల ప్రయోజనాలను పరిరక్షించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఉన్న అచంచలమైన నిబద్ధతకు నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం ఎప్పుడూ కార్మికుల పక్షానే ఉంటుందని భరోసా కల్పించారు.

ఇది కూడా చదవండి: సీఎం రేవంత్ వ్యాఖ్యలకు కౌంటర్‌గా బీఆర్ఎస్ వినూత్న నిరసన!

బొగ్గు ఉత్పత్తి అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటిదని, బొగ్గు లేకపోతే దేశం ఒక్కరోజు కూడా ముందుకు సాగదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న చారిత్రాత్మక సంస్థకు మరింత బలమైన, సుసంపన్నమైన భవిష్యత్తును అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. సింగరేణిని తిరిగి నిలకడైన లాభాల బాటలో నడిపించేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఆయన పునరుద్ఘాటించారు. కార్మికులు, వాళ్ల కుటుంబాలకు ఎల్లప్పుడూ తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని మాట ఇచ్చారు. కార్మికుల సంక్షేమం, వాళ్ల ఆకాంక్షలే కేంద్ర బిందువుగా భవిష్యత్తులో సంస్థ అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు మార్పును బలంగా కోరుకుంటున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే సింగరేణిని మరింత బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు. పారదర్శకమైన పాలనను అందిస్తూ, కార్మికుల సంక్షేమాన్ని మరింతగా మెరుగుపరుస్తామని స్పష్టం చేశారు. సింగరేణి లాంటి జాతీయ సంపదను పరిరక్షించడంతో పాటు, కార్మికుల హక్కుల సాధన కోసం బీజేపీ ఎల్లప్పుడూ అండగా ఉండి నిరంతరం పోరాడుతుందని కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 14 July 2026, 4:20 pm Digital Edition : Prabhanews
సింగరేణిని నిలువునా ముంచేసిన ఆ 2 పార్టీలు.. కిషన్ రెడ్డి ఫైర్ | తెలంగాణ వార్తలు

Last Updated:Jul 14, 2026 4:08 PM ISTకేసీఆర్ జేబు సంస్థగా సింగరేణి.. రేవంత్ సర్కార్ కూడా అంతే.. సింగరేణి కార్మికుల ముందు అసలు గుట్టు విప్పిన కిషన్ రెడ్డి.+
News18తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి సంస్థను గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు రెండు తీవ్రంగా దెబ్బతీశాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. భూపాలపల్లి జిల్లాలో ఆయన సింగరేణి భరోసా యాత్రను నిర్వహించారు. ఇందులో భాగంగా కేటీకే 8 బొగ్గు గనిని స్వయంగా సందర్శించిన ఆయన, సింగరేణి కార్మికులు, వాళ్ల కుటుంబ సభ్యులతో ముఖాముఖిగా మాట్లాడారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల తప్పుడు విధానాల వల్లే కార్మికుల్లో ఆత్మవిశ్వాసం, భద్రతాభావం సన్నగిల్లాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోనే అత్యంత కీలకమైన ఈ ప్రభుత్వ రంగ సంస్థను బలోపేతం చేయాల్సింది పోయి, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే వాడుకున్నారని మండిపడ్డారు.సింగరేణికి రావాల్సిన బకాయిల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాల తీరును కిషన్ రెడ్డి తప్పుబట్టారు. తెలంగాణ జెన్కోకు సరఫరా చేసిన బొగ్గుకు గాను సింగరేణికి దాదాపు తొమ్మిది వేల కోట్లు రావాల్సి ఉందని, దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో జెన్కోకు రూ.8,958 కోట్ల అప్పు ఇస్తే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా రూ.26,875 కోట్ల మేర అప్పు చేసి సంస్థపై తీవ్రమైన ఆర్థిక భారం మోపాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కోసం కేంద్రాన్ని బెదిరించే ధోరణి అవలంబిస్తోందని విమర్శించారు. కేంద్రం అందించిన డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ నిధుల వినియోగం పట్ల తెలంగాణ ప్రభుత్వం పూర్తి పారదర్శకత పాటించాలని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు.ఇది కూడా చదవండి: Ration Card: రేషన్ కార్డు ఉన్న వారికి భారీ శుభవార్త.. ప్రభుత్వం అదిరిపోయే కీలక ప్రకటన!కేసీఆర్ పదేళ్ల పాలనలో సింగరేణి సంస్థ 15 ఏళ్లు వెనక్కి వెళ్లిందని కేంద్ర మంత్రి విమర్శించారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేసీఆర్ ఒక్కరోజైనా సింగరేణి అభివృద్ధి కోసం కేంద్రాన్ని సంప్రదించలేదని, సంస్థను కల్వకుంట్ల కుటుంబం సొంత జేబు సంస్థగా మార్చుకుందని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అచ్చం అలాగే వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. కానీ, తాడిచర్ల 2 బొగ్గు బ్లాక్ ను సింగరేణికి కేటాయించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం.. సింగరేణిని కాపాడటం, కార్మికుల ప్రయోజనాలను పరిరక్షించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఉన్న అచంచలమైన నిబద్ధతకు నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం ఎప్పుడూ కార్మికుల పక్షానే ఉంటుందని భరోసా కల్పించారు.ఇది కూడా చదవండి: సీఎం రేవంత్ వ్యాఖ్యలకు కౌంటర్‌గా బీఆర్ఎస్ వినూత్న నిరసన!బొగ్గు ఉత్పత్తి అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటిదని, బొగ్గు లేకపోతే దేశం ఒక్కరోజు కూడా ముందుకు సాగదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న చారిత్రాత్మక సంస్థకు మరింత బలమైన, సుసంపన్నమైన భవిష్యత్తును అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. సింగరేణిని తిరిగి నిలకడైన లాభాల బాటలో నడిపించేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఆయన పునరుద్ఘాటించారు. కార్మికులు, వాళ్ల కుటుంబాలకు ఎల్లప్పుడూ తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని మాట ఇచ్చారు. కార్మికుల సంక్షేమం, వాళ్ల ఆకాంక్షలే కేంద్ర బిందువుగా భవిష్యత్తులో సంస్థ అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు మార్పును బలంగా కోరుకుంటున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే సింగరేణిని మరింత బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు. పారదర్శకమైన పాలనను అందిస్తూ, కార్మికుల సంక్షేమాన్ని మరింతగా మెరుగుపరుస్తామని స్పష్టం చేశారు. సింగరేణి లాంటి జాతీయ సంపదను పరిరక్షించడంతో పాటు, కార్మికుల హక్కుల సాధన కోసం బీజేపీ ఎల్లప్పుడూ అండగా ఉండి నిరంతరం పోరాడుతుందని కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు.Location :Warangal,Telanganaమరింత చదవండి

Source link