ఆంధ్రప్రదేశ్లో 2,25,206 మొబైల్స్ను బ్లాక్ చేశారు. 1,38,296 మొబైల్స్ను ట్రేస్ చేశారు. 79,776 మొబైల్స్ రికవర్ అయ్యాయి. ఇక్కడ రికవరీ శాతం 57.68గా ఉంది. తెలంగాణలో 5,44,099 మొబైల్స్ను బ్లాక్ చేశారు. 3,21,319 మొబైల్స్ను ట్రేస్ చేశారు. 1,42,551 మొబైల్స్ రికవర్ అయ్యాయి. తెలంగాణలో రికవరీ శాతం 44.36గా నమోదైంది. ప్రభుత్వ CEIR డ్యాష్బోర్డ్ ప్రకారం, ట్రేస్ చేసిన ఫోన్లలో 36.43 శాతం మాత్రమే తిరిగి దొరికాయి. అంటే పోయిన లేదా దొంగిలించబడిన ఫోన్లను గుర్తించే వ్యవస్థ ఉన్నప్పటికీ, ప్రతి ఫోన్ తిరిగి దొరకడం లేదు. అందుకే ఫోన్ పోయిన వెంటనే వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు, డబ్బును కాపాడుకునేందుకు కొన్ని ముఖ్యమైన చర్యలు తీసుకోవడం చాలా అవసరం. (ప్రతీకాత్మక చిత్రం)
