Last Updated:
Yanam: పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం పరిధిలోని యానాంలో అనుమానం పెనుభూతమై నిండు ప్రాణాన్ని బలిగొంది. ప్రేమించి పెళ్లాడిన భార్యపై కలిగిన క్షణికావేశం అనుమానం ఒక కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టేసింది.
పరాయి వ్యక్తితో తన ఫోన్లో చాటింగ్ చేస్తోందన్న కోపంతో కట్టుకున్న భార్యను అత్యంత దారుణంగా కొట్టి చంపిన భర్త, ఆపై ఆనవాళ్లు లేకుండా చేసేందుకు మృతదేహాన్ని నదిలో విసిరేసిన భయానక ఘటన వెలుగుచూసింది. యానాం పరిధిలోని మత్స్యరాలపేటకు చెందిన బెన్నా అప్పారావు (29) చేపల వేట సాగిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి భీంనగర్కు చెందిన పువ్వుల రేఖ (26)తో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది. ఆరేళ్ల క్రితం వీరిద్దరూ పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు. అన్యోన్యంగా సాగుతున్న వీరి వైవాహిక జీవితానికి గుర్తుగా వీరికి ఒక నాలుగేళ్ల కుమారుడు, రెండేళ్ల కుమార్తె జన్మించారు. అయితే కొంతకాలంగా భార్య ప్రవర్తనపై అప్పారావు అనుమానం పెంచుకున్నట్లు సమాచారం.

