Last Updated:
న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మధ్య సుదీర్ఘ ద్వైపాక్షిక చర్చలు ముగిశాయి. సరిహద్దులో శాంతి, వాణిజ్య లోటు తగ్గింపు సహా ఈ భేటీలో చర్చించిన 7 ముఖ్యమైన అంశాలను ఇప్పుడు వివరంగా చూద్దాం.
భారత రాజధాని న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న 18వ బ్రిక్స్ సదస్సులో అత్యంత కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. దాదాపు ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత్కు వచ్చిన చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదాలు, వాణిజ్య సంబంధాలపై వీరు సుదీర్ఘంగా చర్చించారు. 2025 ఆగస్టులో టియాంజిన్లో జరిగిన సమావేశంతో మొదలైన సానుకూల వాతావరణాన్ని కొనసాగించేలా తాజా భేటీలో మోదీ స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.

