Last Updated:
పాకిస్థాన్కు అత్యంత సన్నిహిత మిత్రదేశంగా భావించే చైనా.. భారత్కు అనుకూలంగా ఎందుకు నిలిచింది? BRICS వేదికపై పహల్గామ్ ఉగ్రదాడిని ఖండిస్తూ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది.
BRICSలో ఉగ్రవాదం విషయంలో పాకిస్థాన్కు బహిరంగంగానే అవమానం ఎదురైంది. అదీ చైనా ముందే జరగడం గమనార్హం. శిఖరాగ్ర సదస్సు ప్రకటనలో పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించడంతో పాటు, ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇచ్చేవారిని బాధ్యులను చేయాలన్న అంశానికి డ్రాగన్ కూడా అంగీకరించింది. అయితే ఇందులో పాకిస్థాన్ పేరును నేరుగా ప్రస్తావించలేదు. అయినప్పటికీ ఉగ్రవాదానికి అసలు ఆశ్రయం ఇస్తున్నది ఎవరో ప్రపంచానికి తెలుసు.

