ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో ఇండస్ట్రీకి వచ్చిన బండ్ల గణేష్, చిన్న చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత నిర్మాతగా మారి సంచలనాలు సృష్టించారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్తో ఆయన నిర్మించిన ‘గబ్బర్ సింగ్’ టాలీవుడ్ చరిత్రలో ఆల్ టైమ్ రికార్డులను తిరగరాయడమే కాకుండా బండ్ల గణేష్ను అగ్ర నిర్మాతల జాబితాలో నిలబెట్టింది. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్తో ‘బాద్షా’, ‘టెంపర్’, అల్లు అర్జున్తో ‘ఇద్దరమ్మాయిలతో’ వంటి భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించి తన నిర్మాణ అభిరుచిని చాటుకున్నారు. అయితే, కెరీర్ అత్యున్నత దశలో ఉన్నప్పుడు రాజకీయాల పట్ల ఆకర్షితులై వెళ్లడం, ఆ తర్వాత చోటుచేసుకున్న కొన్ని వివాదాలు, వ్యక్తిగత కారణాల వల్ల ఆయన సినిమా నిర్మాణానికి చాలాకాలం దూరమయ్యారు.
