Last Updated:
ఏడాదిగా మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆ క్షణం వచ్చేసింది. ఇప్పటివరకు కుమారుడి ఫొటోలను బయటకు రానివ్వని వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతులు వాయువ్ తొలి పుట్టినరోజున అతడి ముఖాన్ని తొలిసారి చూపించారు.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, నటి లావణ్య త్రిపాఠి దంపతులు తమ కుమారుడు వాయువ్ తేజ్ ఫొటోను తొలిసారిగా సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. సెప్టెంబర్ 10న వాయువ్ మొదటి పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రత్యేకమైన ఫొటోను విడుదల చేశారు. ఇప్పటివరకు కుమారుడి ప్రైవసీ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉన్న ఈ జంట.. తొలిసారి చిన్నారి ముఖాన్ని చూపించడంతో మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

