కాంగోలోని తిరుగుబాటుదారుల ఆధీనంలోని బుకావు నగరంలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ పాఠశాలలో సంభవించిన ఈ అగ్నిప్రమాదంలో కనీసం 17 మంది మృతి చెందినట్లు స్థానిక, వైద్య వర్గాలు వెల్లడించాయి. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలంలో 17 మంది మృతదేహాలను అంబులెన్స్లోకి తరలించడంలో సహాయపడ్డానని ఓ ప్రత్యక్ష సాక్షి తెలిపారు. మరోవైపు, ఓ ఆరోగ్య కేంద్రానికి 10 మృతదేహాలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. మరో ఆసుపత్రిలో 50 మందికి పైగా విద్యార్థులను చేర్చగా, వారిలో 14 మంది మృతి చెందినట్లు సమాచారం.
Source link
