Last Updated:
గూగుల్ భారతదేశంలో 5 కొత్త పర్యావరణ, స్వచ్ఛ-ఇంధన కార్యక్రమాలను ప్రకటించింది. ఇందులో రూఫ్టాప్ సోలార్ ఇంటెలిజెన్స్, రాజస్థాన్లో 150MW సోలార్ ఒప్పందం, మీథేన్ తగ్గింపు కార్యక్రమం ఉన్నాయి.
భారతదేశంలో స్వచ్ఛ ఇంధన పరివర్తనను వేగవంతం చేయడానికి, జాతీయ వాతావరణ ప్రాధాన్యతలకు మద్దతు ఇవ్వడానికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జియోస్పేషియల్ డేటా, మౌలిక సదుపాయాల పెట్టుబడులను వినియోగిస్తూ, భారతదేశంలో ఐదు కొత్త పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛ-ఇంధన కార్యక్రమాలను గూగుల్ ఈరోజు ప్రకటించింది. ఈ ప్రకటనలలో 30 కోట్లకు పైగా భవనాలను కవర్ చేసే డిస్ట్రిబ్యూటెడ్ రూఫ్టాప్ సోలార్ ఇంటెలిజెన్స్, రాజస్థాన్లో కొత్త 150-మెగావాట్ల (MW) యుటిలిటీ సోలార్ ఒప్పందం, పదివేల మంది చిన్న రైతులకు మద్దతుగా మిట్టి ల్యాబ్స్తో కలిసి చేపట్టిన ఒక చారిత్రాత్మక మీథేన్, నీటి తగ్గింపు కార్యక్రమం, గూగుల్ సెంటర్ ఫర్ క్లైమేట్ టెక్నాలజీ ద్వారా విస్తరించిన పరిశోధన విభాగాలు ఉన్నాయి. “భారతదేశం తమ సాంకేతిక, ఏఐ నాయకత్వాన్ని బలోపేతం చేసుకుంటున్న తరుణంలో, ఈ ఊపు సుస్థిరమైన, సమ్మిళిత వృద్ధికి దారితీసేలా చూడటం మన ఉమ్మడి భవిష్యత్తుకు కీలకం” అని గూగుల్ క్లైమేట్ ఆపరేషన్స్ డైరెక్టర్ వృషాలి గౌడ్ అన్నారు. “స్థానిక సౌర విద్యుత్ వ్యవస్థాపకులకు రూఫ్టాప్ వినియోగాన్ని పెంచడంలో సహాయపడటానికి జియోస్పేషియల్ ఏఐ ను ఉపయోగించడం నుండి, వాతావరణ అనుకూల నీటి పద్ధతులపై రైతులతో కలిసి పనిచేయడం, జాతీయ గ్రిడ్కు కొత్త స్వచ్ఛమైన విద్యుత్ను జోడించడం వరకు ఈ కార్యక్రమాలు భారతదేశానికి ఆచరణాత్మకమైన, శాశ్వత ప్రభావాన్ని సృష్టించటానికి డిజిటల్ ఆవిష్కరణ, పర్యావరణ పరిరక్షణ కలిసికట్టుగా ఎలా కలిసి పనిచేస్తున్నాయో చూపిస్తున్నాయి” అని అన్నారు. ప్రకటనల సమగ్ర వివరాలు ఇలా ఉన్నాయి.

