Last Updated:
Road Accident: కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు వెనుక నుంచి బలంగా ఢీకొన్న ఘటనలో తమిళనాడుకు చెందిన ఎనిమిది మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు వెల్లడించారు.
కైపమంగళం సమీపంలోని పనంబిక్కున్ను వద్ద శుక్రవారం రాత్రి సుమారు 11.40 గంటల సమయంలో ఈ విషాదం జరిగింది. ప్రమాదానికి గురైన కారు గురువాయూర్ నుంచి కొడంగల్లూర్ వైపు ప్రయాణిస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం, కారులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది దిండిగల్లోని ఒక ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులుగా గుర్తించారు. ఈ కారు తమిళనాడు రాష్ట్రానికి (మదురై) చెందిన రిజిస్ట్రేషన్తో ఉంది.

