ప్రభన్యూస్

భారత్‌లో బిజినెస్‌కు ఇదే సరైన టైమ్… అమెరికా గడ్డపై గ్లోబల్ కంపెనీలకు నిర్మలా సీతారామన్ బిగ్ ఆఫర్ | బిజినెస్


Last Updated:

నిర్మలా సీతారామన్ ప్రపంచ పెట్టుబడిదారులను భారత్‌లో తయారీ, టెక్నాలజీ, ఇన్నోవేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు. భారత్‌ను ప్రపంచ మార్కెట్లకు వేదికగా చూడాలన్నారు.

భారత్‌లో బిజినెస్‌కు ఇదే సరైన టైమ్... అమెరికా గడ్డపై గ్లోబల్ కంపెనీలకు నిర్మలా సీతారామన్ బిగ్ ఆఫర్ (image: X / FinMinIndia)
భారత్‌లో బిజినెస్‌కు ఇదే సరైన టైమ్… అమెరికా గడ్డపై గ్లోబల్ కంపెనీలకు నిర్మలా సీతారామన్ బిగ్ ఆఫర్ (image: X / FinMinIndia)

భారత్‌లో తయారీ కేంద్రాలు, టెక్నాలజీ, ఇన్నోవేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రపంచ పెట్టుబడిదారులను ఆహ్వానించారు. భారత్‌లో ఉన్న ప్రతిభ, అవకాశాలను ఉపయోగించుకుని ప్రపంచ మార్కెట్ల కోసం ఉత్పత్తులు, సేవలు అభివృద్ధి చేయాలని ఆమె కోరారు. శుక్రవారం అమెరికాలోని చికాగోలో ప్రముఖ పెట్టుబడిదారులు, వ్యాపార నాయకులతో జరిగిన ఉన్నతస్థాయి బిజినెస్ రౌండ్‌టేబుల్ సమావేశంలో సీతారామన్ మాట్లాడారు. భారత్‌లో అన్ని రంగాల్లోనూ విస్తరిస్తున్న ఆర్థిక వృద్ధి, కొనసాగుతున్న సంస్కరణలు, దీర్ఘకాలిక పెట్టుబడులకు పెరుగుతున్న అవకాశాలను ఆమె వివరించారు. భారత్‌లో పెట్టుబడులకు అవకాశం అంటే ఒక్క రంగానికే పరిమితం కాదని సీతారామన్ చెప్పారు. పెద్ద స్థాయి మార్కెట్, ఆర్థిక వృద్ధి, నైపుణ్యం ఉన్న మానవ వనరులు, మౌలిక వసతులు, టెక్నాలజీ, గత పదేళ్లుగా కొనసాగుతున్న సంస్కరణలు కలిసి భారత్‌ను ఆకర్షణీయమైన పెట్టుబడి గమ్యస్థానంగా మారుస్తున్నాయని తెలిపారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 29 August 2026, 10:24 am Digital Edition : Prabhanews
భారత్‌లో బిజినెస్‌కు ఇదే సరైన టైమ్… అమెరికా గడ్డపై గ్లోబల్ కంపెనీలకు నిర్మలా సీతారామన్ బిగ్ ఆఫర్ | బిజినెస్

Last Updated:Aug 29, 2026 10:06 AM ISTనిర్మలా సీతారామన్ ప్రపంచ పెట్టుబడిదారులను భారత్‌లో తయారీ, టెక్నాలజీ, ఇన్నోవేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు. భారత్‌ను ప్రపంచ మార్కెట్లకు వేదికగా చూడాలన్నారు.భారత్‌లో బిజినెస్‌కు ఇదే సరైన టైమ్... అమెరికా గడ్డపై గ్లోబల్ కంపెనీలకు నిర్మలా సీతారామన్ బిగ్ ఆఫర్ (image: X / FinMinIndia)భారత్‌లో తయారీ కేంద్రాలు, టెక్నాలజీ, ఇన్నోవేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రపంచ పెట్టుబడిదారులను ఆహ్వానించారు. భారత్‌లో ఉన్న ప్రతిభ, అవకాశాలను ఉపయోగించుకుని ప్రపంచ మార్కెట్ల కోసం ఉత్పత్తులు, సేవలు అభివృద్ధి చేయాలని ఆమె కోరారు. శుక్రవారం అమెరికాలోని చికాగోలో ప్రముఖ పెట్టుబడిదారులు, వ్యాపార నాయకులతో జరిగిన ఉన్నతస్థాయి బిజినెస్ రౌండ్‌టేబుల్ సమావేశంలో సీతారామన్ మాట్లాడారు. భారత్‌లో అన్ని రంగాల్లోనూ విస్తరిస్తున్న ఆర్థిక వృద్ధి, కొనసాగుతున్న సంస్కరణలు, దీర్ఘకాలిక పెట్టుబడులకు పెరుగుతున్న అవకాశాలను ఆమె వివరించారు. భారత్‌లో పెట్టుబడులకు అవకాశం అంటే ఒక్క రంగానికే పరిమితం కాదని సీతారామన్ చెప్పారు. పెద్ద స్థాయి మార్కెట్, ఆర్థిక వృద్ధి, నైపుణ్యం ఉన్న మానవ వనరులు, మౌలిక వసతులు, టెక్నాలజీ, గత పదేళ్లుగా కొనసాగుతున్న సంస్కరణలు కలిసి భారత్‌ను ఆకర్షణీయమైన పెట్టుబడి గమ్యస్థానంగా మారుస్తున్నాయని తెలిపారు.మరింత చదవండి

Source link