Last Updated:
చక్కెరను అక్రమంగా నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టించకుండా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 15 నుంచి దేశవ్యాప్తంగా చక్కెర డీలర్ల నిల్వ పరిమితిని 4,000 క్వింటాళ్ల నుంచి 2,000 క్వింటాళ్లకు తగ్గించింది.
దేశీయ మార్కెట్లో చక్కెర తగినంతగా అందుబాటులో ఉండేలా, ధరలపై అనవసర ఒత్తిడి రాకుండా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చక్కెరను భారీగా నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టించడం, అక్రమంగా నిల్వ చేయడం (hoarding), ఊహాజనిత వ్యాపారాన్ని (speculative trading) అరికట్టే ఉద్దేశంతో చక్కెర డీలర్లకు వర్తించే నిల్వ పరిమితిని తగ్గించింది. ఇప్పటివరకు ఉన్న 4,000 క్వింటాళ్ల పరిమితిని 2,000 క్వింటాళ్లకు కుదించింది.

