Last Updated:
ఈపీఎఫ్ వేతన పరిమితిని రూ.15,000 నుంచి రూ.25,000కు పెంచే ప్రతిపాదన చర్చలో ఉంది. ఇది అమలైతే ఎక్కువ మంది ఉద్యోగులు ఈపీఎఫ్ పరిధిలోకి వస్తారు.
ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ అంటే ఈపీఎఫ్ పరిధిలోకి మరింత మంది ఉద్యోగులు వచ్చే అవకాశం ఉందన్న వార్త కొంతకాలంగా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం నెలకు రూ.15,000గా ఉన్న ఈపీఎఫ్ వేతన పరిమితిని రూ.25,000కు పెంచే ప్రతిపాదన ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మార్పు అమల్లోకి వస్తే రూ.15,000 నుంచి రూ.25,000 మధ్య వేతనం పొందుతున్న మరికొంత మంది ఉద్యోగులు తప్పనిసరి ఈపీఎఫ్ పరిధిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. చాలా ఏళ్లుగా వేతన పరిమితి రూ.15,000గానే ఉంది. ఇదే సమయంలో ఉద్యోగుల జీతాలు, జీవన వ్యయాలు గణనీయంగా పెరిగాయి. అందుకే ఈ పరిమితిని పెంచాలన్న ప్రతిపాదనపై ఆసక్తి పెరిగింది. అయితే ఉద్యోగులు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. రూ.25,000 వేతన పరిమితి ఇంకా అధికారికంగా అమల్లోకి రాలేదు. అయితే ఈపీఎఫ్ వేతన పరిమితి పెరిగితే ఉద్యోగులకు లాభమా? నష్టమా? అని హైదరాబాద్కు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్, అఖిల్ కంచర్ల & అసోసియేట్స్ వ్యవస్థాపకుడు అఖిల్ కంచర్ల న్యూస్18 తెలుగుతో మాట్లాడుతూ వివరించారు.

