Last Updated:
UPI Payment Rs 2000 Limit: పెట్రోల్, డీజిల్ వాహనదారులకు సంబంధించిన ఓ మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మధ్యప్రదేశ్లోని పెట్రోల్ బంకుల్లో రూ.2,000 కంటే ఎక్కువ మొత్తానికి UPI చెల్లింపులు స్వీకరించరని, మర్చంట్ ఫీజులకు నిరసనగా పెట్రోల్ పంపు యజమానులు ఈ నిర్ణయం తీసుకున్నారని అందులో ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, సెప్టెంబర్ 23న ఇండోర్లో ‘No-UPI Day’ పాటించనున్నారనే సమాచారం కూడా వైరల్ అవుతోంది. అయితే ఈ ప్రచారంలో నిజం లేదని సంబంధిత వర్గాలు స్పష్టం చేశాయి. పెట్రోల్ బంకుల్లో రూ.2,000 దాటిన UPI చెల్లింపులపై ఎలాంటి కొత్త పరిమితి విధించలేదని IndianOil వెల్లడించింది. మరి ఈ వైరల్ మెసేజ్ వెనుక అసలు నిజం ఏంటి? సెప్టెంబర్ 23న నిజంగానే ‘No-UPI Day’ ఉంటుందా?
పెట్రోల్, డీజిల్ వాహనదారులకు సంబంధించిన ఓ మెసేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్లోని పెట్రోల్ బంకుల్లో రూ.2,000 కంటే ఎక్కువ మొత్తానికి UPI చెల్లింపులు స్వీకరించరని, మర్చంట్ ఫీజులకు నిరసనగా పెట్రోల్ పంపు యజమానులు ఈ నిర్ణయం తీసుకున్నారని ఆ మెసేజ్లో ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా 2026 సెప్టెంబర్ 23న ఇండోర్లో “No-UPI Day” పాటించనున్నారని కూడా పేర్కొంటున్నారు.
ఈ మెసేజ్ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుండటంతో చాలామంది వాహనదారుల్లో సందేహాలు మొదలయ్యాయి. పెట్రోల్ బంక్లో UPI ద్వారా చెల్లించేటప్పుడు రూ.2,000 పరిమితి నిజంగానే అమల్లోకి వస్తుందా? సెప్టెంబర్ 23న UPI చెల్లింపులు నిలిచిపోతాయా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఈ ప్రచారంలో నిజం లేదని సంబంధిత వర్గాలు స్పష్టం చేశాయి.
మధ్యప్రదేశ్లోని పెట్రోల్ బంకుల్లో రూ.2,000 దాటిన UPI చెల్లింపులను స్వీకరించకూడదనే నిర్ణయం ఏదీ తీసుకోలేదని ఇండియన్ ఆయిల్ (IndianOil) స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మెసేజ్ నకిలీ, తప్పుదోవ పట్టించేదిగా పేర్కొంది. అంటే వాహనదారులు పెట్రోల్ లేదా డీజిల్ కొనుగోలు చేసినప్పుడు రూ.2,000 కంటే ఎక్కువ మొత్తాన్ని UPI ద్వారా చెల్లించడంపై ఈ వైరల్ మెసేజ్ ఆధారంగా ఎలాంటి కొత్త పరిమితి ఉందని భావించాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ప్రచారం జరుగుతున్న రూ.2,000 పరిమితికి అధికారిక ఆధారం లేదని స్పష్టం చేశారు.
Claim
A message is going viral on social media claiming that petrol pump owners in Madhya Pradesh have announced that UPI payments exceeding ₹2,000 will not be accepted in protest against merchant fees and that a “No-UPI Day” will be observed in Indore on September 23, 2026.… pic.twitter.com/NwvmmkJFhx
— Indian Oil Corp Ltd (@IndianOilcl) September 19, 2026
వైరల్ మెసేజ్లో మరో కీలకమైన విషయం సెప్టెంబర్ 23, 2026న ఇండోర్లో “No-UPI Day” నిర్వహించనున్నారనే ప్రచారం. అయితే పెట్రోలియం డీలర్ల సంఘాలు ఇలాంటి కార్యక్రమాన్ని ప్రకటించలేదని సంబంధిత సమాచారం చెబుతోంది. పెట్రోలియం డీలర్ల సంఘాలు తమ సమస్యలు, డిమాండ్లపై సంబంధిత మంత్రిత్వ శాఖ అధికారులతో సంప్రదింపులు కొనసాగిస్తున్నాయని తెలిపారు. అయితే దీనికి సంబంధించి సెప్టెంబర్ 23న UPI చెల్లింపులను నిలిపివేసేలా ఎలాంటి “No-UPI Day” పిలుపు ఇవ్వలేదని స్పష్టం చేశారు.
వైరల్ మెసేజ్లో పెట్రోల్ బంక్ యజమానులు UPI చెల్లింపులపై పరిమితులు విధిస్తున్నట్లు పేర్కొన్నప్పటికీ, ఇలాంటి వాదనలు చేస్తున్న కొంతమంది వ్యక్తులు వాస్తవానికి పెట్రోలియం డీలర్లు కాదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అందువల్ల సోషల్ మీడియాలో ఒక మెసేజ్ వైరల్ అవుతోందని మాత్రమే దాన్ని అధికారిక ప్రకటనగా పరిగణించకూడదు. ముఖ్యంగా చెల్లింపులు, బ్యాంకింగ్, పెట్రోల్ ధరలు లేదా పెట్రోల్ బంకుల్లో కొత్త నిబంధనలకు సంబంధించిన సమాచారం అయితే అధికారిక సంస్థలు లేదా సంబంధిత డీలర్ సంఘాల నుంచి వచ్చిన ప్రకటనలను మాత్రమే ఆధారంగా తీసుకోవడం మంచిది.
వాస్తవానికి పెట్రోల్ బంకుల్లో డిజిటల్ చెల్లింపుల వినియోగం చాలాకాలంగా కొనసాగుతోంది. UPI, కార్డులు, ఇతర డిజిటల్ పేమెంట్ మార్గాల ద్వారా చెల్లింపులు చేయడం వినియోగదారులకు సౌకర్యంగా ఉండటంతో వీటి వినియోగం పెరిగింది. పెట్రోలియం డీలర్లు కూడా డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. కాబట్టి వైరల్ అవుతున్న మెసేజ్ ఆధారంగా UPI చెల్లింపులపై కొత్త నిబంధన వచ్చిందని భావించాల్సిన అవసరం లేదు.

