Last Updated:
హీరోయిన్, నటి రేణు దేశాయ్.. ఇప్పుడు ఓటీటీ (OTT) ప్లాట్ఫామ్పై తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ఆమె చేసిన కాశీ మజిలీ మూవీ సెప్టెంబర్ 13వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
రేణు దేశాయ్… ఈ పేరు చెప్పగానే తెలుగు ప్రేక్షకులకు ముందుగా ‘బద్రి’, ‘జాని’ చిత్రాలు గుర్తుకు వస్తాయి. నటిగా మాత్రమే కాకుండా ఆమెలో ఓ అద్భుతమైన రచయిత్రి, దర్శకురాలు కూడా దాగి ఉన్నారనే విషయం కొద్దిమందికే తెలుసు. తన మాతృభాష మరాఠీలో ‘ఇష్క్ వాలా లవ్’ అనే చిత్రానికి కథను అందించి, దర్శకత్వం వహించి తన టాలెంట్ చాటుకున్నారు. ఆ తర్వాత రవితేజ ‘టైగర్ నాగేశ్వర రావు’ చిత్రంలో సామాజిక కార్యకర్త హేమలతా లవణం అనే పవర్ ఫుల్ పాత్రలో కనిపించి మెప్పించిన రేణు దేశాయ్, ఇప్పుడు ఓటీటీ (OTT) ప్లాట్ఫామ్పై తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు.

