Last Updated:
బ్యాంకింగ్ వ్యవస్థలో భారీగా పెరిగిన అదనపు లిక్విడిటీని నియంత్రించేందుకు RBI కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్లో మిగులు నగదును కొంతమేర వెనక్కి తీసుకునేందుకు ఏకంగా రూ.1 లక్ష కోట్ల విలువైన ప్రభుత్వ సెక్యూరిటీలను OMO ద్వారా విక్రయించనుంది. ఈ ప్రక్రియను మూడు విడతల్లో నిర్వహించనుండగా.. సెప్టెంబర్ 17న రూ.50,000 కోట్లు, ఆ తర్వాత సెప్టెంబర్ 21న రూ.25,000 కోట్లు, సెప్టెంబర్ 28న మరో రూ.25,000 కోట్ల విలువైన సెక్యూరిటీలను విక్రయించనుంది. ఇంత భారీ మొత్తంలో లిక్విడిటీని RBI ఎందుకు వెనక్కి తీసుకుంటోంది? దీని వల్ల బ్యాంకులు, లోన్లు తీసుకున్నవారు, సాధారణ ప్రజలపై ఎలాంటి ప్రభావం ఉండొచ్చు? తెలుసుకుందాం.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకింగ్ వ్యవస్థలో భారీగా పెరిగిన అదనపు లిక్విడిటీని నియంత్రించేందుకు మొత్తం రూ.1 లక్ష కోట్ల విలువైన భారత ప్రభుత్వ సెక్యూరిటీలను ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ (OMO) ద్వారా విక్రయించనున్నట్లు ప్రకటించింది. ఈ విక్రయాలను మూడు విడతల్లో నిర్వహించనుంది. మొదటి విడతలో రూ.50,000 కోట్ల విలువైన ప్రభుత్వ సెక్యూరిటీల వేలం సెప్టెంబర్ 17న జరగనుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 21న రూ.25,000 కోట్లు, సెప్టెంబర్ 28న మరో రూ.25,000 కోట్ల విలువైన సెక్యూరిటీలను విక్రయించనుంది.

