MSTC భారత ప్రభుత్వానికి చెందిన విశ్వసనీయ ఈ-కామర్స్ పోర్టల్. ఈ వెబ్సైట్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, సైన్యం, పోలీసులు, ప్రభుత్వ రంగ సంస్థలు ఉపయోగించిన వాహనాలను ఈ-వేలం ద్వారా విక్రయిస్తారు. విభాగాల్లో కొత్త వాహనాలు చేరిన తర్వాత పాత వాహనాలను ఈ పోర్టల్లో వేలానికి ఉంచుతారు. వినియోగదారులు ఇంటి నుంచే ఈ పోర్టల్లో నమోదు చేసుకుని ఈ-వేలంలో పాల్గొనవచ్చు. కొన్ని సందర్భాల్లో రూ.12 లక్షల వరకు విలువైన SUVలు లేదా సెడాన్ కార్లు కూడా రూ.2 నుంచి రూ.3 లక్షల ప్రారంభ ధరలో లభించే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

