ఈ ప్రత్యేక రైళ్లతో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని పలు ముఖ్యమైన ప్రాంతాలకు రైలు కనెక్టివిటీ లభిస్తుంది. రెండు వైపులా రైళ్లు పోఖ్రాయన్, ఓరై, వీరాంగనా లక్ష్మీబాయి ఝాన్సీ, లలిత్పూర్, బీనా, భోపాల్, ఇటార్సీ, నాగ్పూర్, చంద్రపూర్, బల్హార్షా, సిర్పూర్ కాగజ్నగర్, రామగుండం, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్పేట, సేలం, నమక్కల్, కరూర్, దిండిగల్ స్టేషన్లలో ఆగుతాయి. ఈ రైళ్లలో 2ఏసీ, 3ఏసీ, 3ఏసీ ఎకానమీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు ఉంటాయి. దీంతో పండుగ సమయంలో ప్రయాణికులకు మరిన్ని రైలు ఎంపికలు అందుబాటులోకి వస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
