జాగిల్ సంస్థ సీహెచ్ఆర్ఓ లతా అయ్యర్ మనీకంట్రోల్తో మాట్లాడుతూ, ఈపీఎఫ్, ఈపీఎస్ వేతన పరిమితిని రూ.15,000 నుంచి రూ.25,000కు పెంచడం వల్ల జీతాలు పొందే భారతీయ ఉద్యోగుల సామాజిక భద్రత పరిధి గణనీయంగా పెరుగుతుందని చెప్పారు. కొత్త పరిమితిపై 12 శాతం కాంట్రిబ్యూషన్ వర్తిస్తే, ప్రభావిత ఉద్యోగుల నెలవారీ కాంట్రిబ్యూషన్ రూ.1,800 నుంచి రూ.3,000కు పెరగొచ్చని ఆమె తెలిపారు. దీంతో చేతికి వచ్చే జీతం నెలకు రూ.1,200 వరకు తగ్గొచ్చు. అయితే ఇప్పుడే చేతికి వచ్చే ఆదాయంలో కొంత భాగం తగ్గినా, ఆ మొత్తం దీర్ఘకాలిక రిటైర్మెంట్ పొదుపుగా మారుతుందని ఆమె వివరించారు. (ప్రతీకాత్మక చిత్రం)

