ప్రభన్యూస్

Donald Trump: చమురు రవాణాపై ట్రంప్ కొత్త ప్లాన్.. హోర్ముజ్ గుండా వెళ్లే కార్గోపై 20% వసూలు! |


Last Updated:

హోర్ముజ్ జలసంధికి అమెరికా ఇకపై ‘గార్డియన్’గా వ్యవహరిస్తుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. భద్రతా ఖర్చుల పేరుతో హోర్ముజ్ గుండా వెళ్లే ప్రతి కార్గోపై 20 శాతం చార్జీ వసూలు చేయాలని ప్రతిపాదించగా, ఇరాన్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ పరిణామం ప్రపంచ ఇంధన మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశముంది.

(IMAGE: AFP)
(IMAGE: AFP)

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz)పై చేసిన తాజా ప్రకటన అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. ప్రపంచ చమురు రవాణాలో కీలక పాత్ర పోషించే ఈ వ్యూహాత్మక జలమార్గానికి ఇకపై అమెరికా “గార్డియన్”గా వ్యవహరిస్తుందని ట్రంప్ ప్రకటించారు. అలాగే హోర్ముజ్ జలసంధి గుండా రవాణా అయ్యే అన్ని సరుకులపై 20 శాతం చార్జీ వసూలు చేయనున్నట్లు వెల్లడించారు. భద్రత కల్పించడానికి అయ్యే ఖర్చులకు ఇది పరిహారంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

సోమవారం తన ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ ఈ ప్రకటన చేశారు. “హోర్ముజ్ జలసంధి తెరిచి ఉంది, అలాగే తెరిచే ఉంటుంది. ఇరాన్ ఉన్నా లేకపోయినా ఈ మార్గం అందరికీ అందుబాటులో ఉంటుంది. మేము ‘ఇరానియన్ బ్లాకేడ్’ను మళ్లీ అమల్లోకి తీసుకొస్తున్నాం. ఇతర దేశాలన్నీ ఈ జలసంధిని న్యాయంగా, స్వేచ్ఛగా వినియోగించుకోవచ్చు” అని ఆయన రాశారు.

అదే పోస్టులో అమెరికా ఇకపై “ది గార్డియన్ ఆఫ్ ది హోర్ముజ్ స్ట్రైట్”గా పిలువబడుతుందని ట్రంప్ పేర్కొన్నారు. “ఈ అస్థిర ప్రాంతంలో భద్రత, రక్షణ కల్పించడానికి అయ్యే అన్ని ఖర్చులకు పరిహారంగా హోర్ముజ్ జలసంధి గుండా రవాణా అయ్యే ప్రతి సరుకు విలువపై 20 శాతం చార్జీ వసూలు చేస్తాం. ఇది న్యాయబద్ధమైన నిర్ణయం” అని ఆయన చెప్పారు.

ఈ ప్రకటనకు కొద్ది గంటల ముందే ట్రంప్ ఫాక్స్ అండ్ ఫ్రెండ్స్ (Fox & Friends) కార్యక్రమంలో కూడా ఇదే అంశంపై మాట్లాడారు. అమెరికా చాలా కాలంగా హోర్ముజ్ జలసంధికి భద్రత కల్పిస్తోందని, కానీ దానికి ఎలాంటి ప్రతిఫలం పొందడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. “మేము ఈ మార్గాన్ని కాపాడుతున్నాం. మా సిబ్బందిని ప్రమాదంలోకి పంపుతున్నాం. అందుకు సరైన పరిహారం రావాలి. మేము కేవలం ఖర్చుల భర్తీ మాత్రమే కోరుతున్నాం” అని ఆయన అన్నారు.

అయితే ఈ ప్రతిపాదిత 20 శాతం చార్జీని ఎలా అమలు చేస్తారు? ఏ చట్టపరమైన వ్యవస్థ కింద ఇది అమల్లోకి వస్తుంది? ఇతర దేశాలు, అంతర్జాతీయ షిప్పింగ్ సంస్థలు దీనికి ఎలా స్పందిస్తాయి? అనే అంశాలపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో ట్రంప్ ప్రకటన అమలుపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఇదిలా ఉండగా, ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ట్రంప్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. హోర్ముజ్ జలసంధిపై అధికారం ఇప్పటికీ ఇరాన్‌కే ఉందని, విదేశీ జోక్యాన్ని తాము అంగీకరించబోమని స్పష్టం చేసింది.

ఒక IRGC ప్రతినిధి మాట్లాడుతూ, “హోర్ముజ్ జలసంధిపై మా అధికారం, నియంత్రణను మేము బలంగా కొనసాగిస్తాం. విదేశీ శక్తులు, వారి మిత్రదేశాలు ఇరాన్ ప్రజల సంకల్పానికి లోబడేలా చేస్తాం” అని హెచ్చరించారు. ఈ ప్రకటనతో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరిగే అవకాశముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

హోర్ముజ్ జలసంధి ప్రపంచ ఇంధన భద్రతకు అత్యంత కీలకమైన మార్గం. పర్షియన్ గల్ఫ్ ప్రాంతం నుంచి వెలువడే భారీ స్థాయి చమురు, సహజ వాయువు సరఫరా ఈ మార్గం ద్వారానే ప్రపంచ మార్కెట్లకు చేరుతుంది. అందువల్ల ఈ జలసంధి చుట్టూ ఏర్పడే ఏ రాజకీయ, సైనిక పరిణామమైనా ప్రపంచ ఇంధన ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ట్రంప్ తాజా ప్రకటనపై అంతర్జాతీయ సమాజం ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 14 July 2026, 3:37 am Digital Edition : Prabhanews
Donald Trump: చమురు రవాణాపై ట్రంప్ కొత్త ప్లాన్.. హోర్ముజ్ గుండా వెళ్లే కార్గోపై 20% వసూలు! |

Last Updated:Jul 13, 2026 10:22 PM ISTహోర్ముజ్ జలసంధికి అమెరికా ఇకపై 'గార్డియన్'గా వ్యవహరిస్తుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. భద్రతా ఖర్చుల పేరుతో హోర్ముజ్ గుండా వెళ్లే ప్రతి కార్గోపై 20 శాతం చార్జీ వసూలు చేయాలని ప్రతిపాదించగా, ఇరాన్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ పరిణామం ప్రపంచ ఇంధన మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశముంది.
(IMAGE: AFP)అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz)పై చేసిన తాజా ప్రకటన అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. ప్రపంచ చమురు రవాణాలో కీలక పాత్ర పోషించే ఈ వ్యూహాత్మక జలమార్గానికి ఇకపై అమెరికా “గార్డియన్”గా వ్యవహరిస్తుందని ట్రంప్ ప్రకటించారు. అలాగే హోర్ముజ్ జలసంధి గుండా రవాణా అయ్యే అన్ని సరుకులపై 20 శాతం చార్జీ వసూలు చేయనున్నట్లు వెల్లడించారు. భద్రత కల్పించడానికి అయ్యే ఖర్చులకు ఇది పరిహారంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.సోమవారం తన ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ ఈ ప్రకటన చేశారు. “హోర్ముజ్ జలసంధి తెరిచి ఉంది, అలాగే తెరిచే ఉంటుంది. ఇరాన్ ఉన్నా లేకపోయినా ఈ మార్గం అందరికీ అందుబాటులో ఉంటుంది. మేము ‘ఇరానియన్ బ్లాకేడ్’ను మళ్లీ అమల్లోకి తీసుకొస్తున్నాం. ఇతర దేశాలన్నీ ఈ జలసంధిని న్యాయంగా, స్వేచ్ఛగా వినియోగించుకోవచ్చు” అని ఆయన రాశారు.అదే పోస్టులో అమెరికా ఇకపై “ది గార్డియన్ ఆఫ్ ది హోర్ముజ్ స్ట్రైట్”గా పిలువబడుతుందని ట్రంప్ పేర్కొన్నారు. “ఈ అస్థిర ప్రాంతంలో భద్రత, రక్షణ కల్పించడానికి అయ్యే అన్ని ఖర్చులకు పరిహారంగా హోర్ముజ్ జలసంధి గుండా రవాణా అయ్యే ప్రతి సరుకు విలువపై 20 శాతం చార్జీ వసూలు చేస్తాం. ఇది న్యాయబద్ధమైన నిర్ణయం” అని ఆయన చెప్పారు.ఈ ప్రకటనకు కొద్ది గంటల ముందే ట్రంప్ ఫాక్స్ అండ్ ఫ్రెండ్స్ (Fox & Friends) కార్యక్రమంలో కూడా ఇదే అంశంపై మాట్లాడారు. అమెరికా చాలా కాలంగా హోర్ముజ్ జలసంధికి భద్రత కల్పిస్తోందని, కానీ దానికి ఎలాంటి ప్రతిఫలం పొందడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. “మేము ఈ మార్గాన్ని కాపాడుతున్నాం. మా సిబ్బందిని ప్రమాదంలోకి పంపుతున్నాం. అందుకు సరైన పరిహారం రావాలి. మేము కేవలం ఖర్చుల భర్తీ మాత్రమే కోరుతున్నాం” అని ఆయన అన్నారు.అయితే ఈ ప్రతిపాదిత 20 శాతం చార్జీని ఎలా అమలు చేస్తారు? ఏ చట్టపరమైన వ్యవస్థ కింద ఇది అమల్లోకి వస్తుంది? ఇతర దేశాలు, అంతర్జాతీయ షిప్పింగ్ సంస్థలు దీనికి ఎలా స్పందిస్తాయి? అనే అంశాలపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో ట్రంప్ ప్రకటన అమలుపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ఇదిలా ఉండగా, ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ట్రంప్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. హోర్ముజ్ జలసంధిపై అధికారం ఇప్పటికీ ఇరాన్‌కే ఉందని, విదేశీ జోక్యాన్ని తాము అంగీకరించబోమని స్పష్టం చేసింది.ఒక IRGC ప్రతినిధి మాట్లాడుతూ, “హోర్ముజ్ జలసంధిపై మా అధికారం, నియంత్రణను మేము బలంగా కొనసాగిస్తాం. విదేశీ శక్తులు, వారి మిత్రదేశాలు ఇరాన్ ప్రజల సంకల్పానికి లోబడేలా చేస్తాం” అని హెచ్చరించారు. ఈ ప్రకటనతో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరిగే అవకాశముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.హోర్ముజ్ జలసంధి ప్రపంచ ఇంధన భద్రతకు అత్యంత కీలకమైన మార్గం. పర్షియన్ గల్ఫ్ ప్రాంతం నుంచి వెలువడే భారీ స్థాయి చమురు, సహజ వాయువు సరఫరా ఈ మార్గం ద్వారానే ప్రపంచ మార్కెట్లకు చేరుతుంది. అందువల్ల ఈ జలసంధి చుట్టూ ఏర్పడే ఏ రాజకీయ, సైనిక పరిణామమైనా ప్రపంచ ఇంధన ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ట్రంప్ తాజా ప్రకటనపై అంతర్జాతీయ సమాజం ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.Click here to add News18 as your preferred news source on Google. బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.Location :Hyderabad,TelanganaFirst Published :Jul 13, 2026 10:22 PM ISTమరింత చదవండి

Source link